News August 8, 2024

సిల్వర్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించిన వినేశ్!

image

అధిక బరువు ఉన్నారనే కారణంతో అనర్హత వేటుకు గురైన రెజ్లర్ వినేశ్ ఫొగట్ క్రీడా కోర్టు(CAS)ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాను ఫైనల్‌కు చేరడంతో సిల్వర్ ఇవ్వాలని ఆమె కోరినట్లు సమాచారం. తనను ఎలిమినేట్ చేయడం సరికాదని పేర్కొన్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై కోర్టు ఇవాళ ఉదయం తీర్పు ఇవ్వనుంది. ఒకవేళ కోర్టు సానుకూలంగా స్పందిస్తే ఫైనల్లో ఓడిన రెజ్లర్‌తో వినేశ్‌ రజతం అందుకునే అవకాశం ఉంది.

Similar News

News December 30, 2025

సంక్రాంతికి మరో 11 స్పెషల్ ట్రైన్స్: SCR

image

సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 11 స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) ప్రకటించింది. జనవరి 7 నుంచి జనవరి 12 మధ్య ఇవి రాకపోకలు సాగించనున్నాయి. కాకినాడ టౌన్‌-వికారాబాద్‌, వికారాబాద్‌-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్‌, పార్వతీపురం-కాకినాడ టౌన్‌, సికింద్రాబాద్‌-పార్వతీపురం, వికారాబాద్‌-కాకినాడ మధ్య ఈ ట్రైన్స్ నడవనున్నాయి. వీటికి బుకింగ్స్‌ ప్రారంభమైనట్లు తెలిపింది.

News December 30, 2025

రూ.100 కోట్లు డొనేట్ చేసిన పూర్వ విద్యార్థులు

image

IIT కాన్పూర్ చరిత్రలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. 2000 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఏకంగా రూ.100కోట్ల విరాళం అందించారు. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ విరాళాన్ని ప్రకటించి.. ప్రొఫెసర్లు, విద్యాసంస్థ పట్ల తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ డబ్బులతో ‘మిలీనియం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సొసైటీ’ ఏర్పాటు చేయనున్నారు. ఇన్‌స్టిట్యూట్‌కి ఒకే బ్యాచ్ స్టూడెంట్స్ ఇంత మొత్తంలో విరాళం ఇవ్వడం ఇదే మొదటిసారి.

News December 30, 2025

IMA నుంచి తొలి మహిళా ఆఫీసర్

image

డెహ్రడూన్‌లోని ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ మిలిటరీ అకాడమీ(ఐఎంఎ) తొలి మహిళా ఆఫీసర్‌గా 23 సంవత్సరాల సాయి జాదవ్‌ చరిత్ర సృష్టించింది. 1932లో ప్రారంభమైన ఈ అకాడమీ నుంచి 67,000 మంది ఆఫీసర్‌ క్యాడెట్‌లు పాసవుట్‌ పరేడ్‌ చేశారు. అందులో ఒక్కరు కూడా మహిళ లేరు. ఆరు నెలల కఠిన సైనిక శిక్షణ పూర్తి చేసుకొని ‘ఐఎంఎ’ నుంచి పట్టభద్రురాలైన తొలి మహిళా సైనిక అధికారిగా చరిత్ర సృష్టించింది సాయి జాదవ్.