News August 23, 2024

కాంగ్రెస్‌లోకి వినేశ్: హరియాణా మాజీ CM ఏమన్నారంటే..

image

రెజ్లర్ వినేశ్ ఫొగట్ కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న వార్తలపై హరియాణా మాజీ సీఎం భూపేందర్ హుడా స్పందించారు. అది హైపోథెటికల్ క్వశ్చన్ అన్నారు. ‘అథ్లెట్లు ఏ పార్టీకీ చెందరు. ఎవరైనా చేరితే మీకు తెలియజేస్తాం. ఎవరు చేరినా మేం స్వాగతిస్తాం. అది ఆమె నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. స్వర్ణ పతక విజేత స్థాయిలోనే ఆమెను గౌరవించాలి. సచిన్‌ టెండూల్కర్‌లా రాజ్యసభకు నామినేట్ చేయాలి. ఆమెకు అన్యాయం జరిగింది’ అని అన్నారు.

Similar News

News April 13, 2026

పందుల నుంచి పంటను కాపాడే ద్రావణం!

image

కొందరు రైతులు పందుల బారి నుంచి తమ పంటను రక్షించుకోవడానికి కుళ్లిన కోడిగుడ్లను నీటిలో కలిపి పంట చుట్టూ చల్లుతున్నారు. ఈ ద్రావణం నుంచి వచ్చే సల్ఫర్ వాసన పందులకు చాలా అసహ్యంగా అనిపించడంతో పాటు పంట సహజ వాసనను వాటికి రానివ్వదు. దీంతో పందులు ఆ ప్రాంతానికి రావడానికి ఇష్టపడవని నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షం పడినా లేదా వారం తర్వాత వాసన తగ్గిపోతే ఈ ద్రావణాన్ని పొలం చుట్టూ మళ్లీ చల్లాల్సి ఉంటుంది.

News April 13, 2026

రేపు CBSE టెన్త్ ఫలితాలు?

image

CBSE టెన్త్ క్లాస్ సెషన్-1 పరీక్షల ఫలితాలు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇవాళ సాయంత్రంలోపు బోర్డు ప్రకటన చేయనున్నట్లు సమాచారం. https://www.cbse.gov.in/లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి-మార్చిలో జరిగిన ఈ ఎగ్జామ్స్‌కు దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్కుల ఇంప్రూవ్‌మెంట్ కోసం సెషన్-2 పరీక్షలు మే 15 నుంచి జరగనున్నాయి.

News April 13, 2026

ట్విన్స్.. వారి మార్కులూ సేమ్

image

TG: ఇంటర్ పరీక్షల్లో ఒకే మార్కులు సాధించి కవలలు అద్భుత ప్రతిభ కనబరిచారు. నల్గొండకు చెందిన వేణుగోపాల్, భారతి దంపతులకు దుర్గాంజలి, అఖిల అనే ట్విన్స్ ఉన్నారు. వీరు చిన్నప్పటి నుంచి కలిసే చదువుతున్నారు. నిన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఇద్దరికీ 1000కి 986 మార్కులు వచ్చాయి. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.