News August 26, 2024
పోరాటం మిగిలే ఉందన్న వినేశ్ ఫొగట్

తన పోరాటం ముగియలేదని రెజ్లర్ వినేశ్ ఫొగట్ అన్నారు. సర్వ్ఖాప్ పంచాయతీ స్వర్ణ పతకంతో సన్మానించాక ఆమె మాట్లాడారు. ‘మన అమ్మాయిల గౌరవం కోసం అసలు పోరు ఇప్పుడే మొదలైంది. మేం ఢిల్లీలో కూర్చున్నప్పుడూ ఇదే చెప్పాం’ అని చెప్పారు. పారిస్ ఒలింపిక్స్లో డిస్క్వాలిఫై అవ్వగానే బాధపడ్డానని ఆమె అన్నారు. దేశానికి తిరిగొచ్చాక ఇక్కడి ప్రేమ, మద్దతు చూశాక అదృష్టవంతురాలిగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
Similar News
News October 26, 2025
కుక్క కరిచిన నెల తర్వాత చిన్నారి మృతి

TG: నిజామాబాద్(D) బాల్కొండకు చెందిన గడ్డం లక్షణ(10) అనే బాలిక కుక్క కరిచిన నెల తర్వాత మరణించింది. కుక్క గీరడంతో ఆమె తలకు గాయమైంది. ఇంట్లో చెబితే తిడతారనే భయంతో చెప్పలేదు. 3 రోజుల క్రితం కుక్కలా అరుస్తూ వింతగా ప్రవర్తించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేబిస్ వ్యాధి తీవ్రమై చనిపోయిందని వైద్యులు తెలిపారు. కుక్క కరిచిన వెంటనే రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News October 26, 2025
అష్ట ధర్మములు ఏవంటే?

1. యజ్ఞాలు చేయడం, 2. వేదాలు చదవడం,
3. దానాలు చేయడం, 4. తపస్సు చేయడం,
5. సత్యాన్నే పలకడం, 6. సహనం పాటించడం,
7. కష్ట సమయాల్లో నిలకడ, ధైర్యంగా ఉండటం,
8. వివేకం, ముందుచూపుతో వ్యవహరించడం.
ఈ ఎనిమిది ధర్మాలను పాటించడం వలన మనిషి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ, ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
<<-se>>#Sankhya<<>>
News October 26, 2025
చనిపోయిన స్నేహితుడిపై ఎర్రిస్వామి ఫిర్యాదు

బైక్ ప్రమాదంలో చనిపోయిన శివశంకర్పై అతడి స్నేహితుడు ఎర్రిస్వామి కర్నూలు (D) ఉలిందకొండ PSలో ఫిర్యాదు చేశాడు. ‘నేను, శివశంకర్ మద్యం సేవించాం. అతడి నిర్లక్ష్యం వల్లే ఇద్దరం కిందపడిపోయాం. శివ స్పాట్లో చనిపోయాడు. డెడ్ బాడీని పక్కకు తీసేందుకు ప్రయత్నించాను. మా <<18102090>>బైకును<<>> మరో వాహనం ఢీకొట్టడంతో అది రోడ్డు మధ్యలో పడింది. దీంతో బస్సు బైకును లాక్కెళ్లింది’ అని తెలిపాడు. దీంతో శివపై పోలీసులు కేసు నమోదు చేశారు.


