News November 16, 2024
మణిపుర్లో మళ్లీ హింస.. కర్ఫ్యూ విధింపు

మణిపుర్లో మళ్లీ కర్ఫ్యూ విధించారు. జిరిబమ్ ప్రాంతంలో మిలిటెంట్లు ఆరుగురు కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి హతమార్చారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసన చేపట్టారు. ఆస్తులను ధ్వంసం చేశారు. బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించి దాడి చేశారు. హింసాత్మక ఘటనలు తీవ్రం కావడంతో ఏడు జిల్లాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు.
Similar News
News November 25, 2025
మహిళలకు నేడు వడ్డీ లేని రుణాల పంపిణీ

TG: 3.50 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వడ్డీ లేని రుణాలను అందించనుంది. ఇందుకోసం నిన్న సంఘాల ఖాతాల్లో రూ.304 కోట్లు జమ చేసింది. నేడు అన్ని నియోజకవర్గాల్లో ఉ.11 గంటలకు ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని Dy.CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం ఆ స్కీమ్ను పునరుద్ధరించామని పేర్కొన్నారు.
News November 25, 2025
నగదు విరాళాలపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు

రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే రూ.2 వేల లోపు నగదు విరాళాలకు ఐటీ మినహాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. నగదు రూపంలో విరాళాలు తీసుకుంటే ఎన్నికల గుర్తు కేటాయించబోమని, పొలిటికల్ పార్టీగా నమోదు చేయబోమని షరతులు విధించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం, ఈసీతోపాటు రాజకీయ పార్టీలకు సుప్రీం నోటీసులిచ్చింది.
News November 25, 2025
GAIL (INDIA) లిమిటెడ్లో ఉద్యోగాలు

<


