News March 23, 2025

ఆ 2 రోజులు VIP బ్రేక్ దర్శనాలు రద్దు

image

AP: తిరుమలలో ఈ నెల 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో 24, 29వ తేదీల్లో సిఫారసు లేఖలు అనుమతించబోమని తెలిపింది. మరోవైపు తెలంగాణ ప్రజాప్రతినిధులు లేఖలను 23వ తేదీ స్వీకరించి 24న దర్శనానికి అనుమతించబోమని స్పష్టం చేసింది.

Similar News

News March 25, 2025

మహిళలకు తగ్గిన లీడర్‌షిప్ పొజిషన్లు: టీమ్‌లీజ్

image

హయ్యర్ లీడర్‌షిప్ స్థాయుల్లో మహిళల ప్రాతినిధ్యం సగటున 19%కి తగ్గినట్టు టీమ్‌లీజ్ రిపోర్టు తెలిపింది. ఎంట్రీ లెవల్ పొజిషన్లలో 46% ఉన్నట్టు పేర్కొంది. ఇక వారి నిరుద్యోగ రేటు 2.9 నుంచి 3.2%కి పెరిగిందని వెల్లడించింది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ బాగుందంది. కన్జూమర్ సర్వీసెస్, రిటైల్, విద్య వంటి రంగాల్లో వారికి సీ-సూట్ పొజిషన్లు ఎక్కువగా దక్కుతున్నాయి.

News March 25, 2025

హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్ల కీలక నిర్ణయం

image

TG: హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్నిప్రమాదాలు, వరద ముంపు నివారణకు రెండు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు చెరువుల సంరక్షణ, సుందరీకరణ, పునరుద్ధరణపై చర్చించారు.

News March 25, 2025

50వేల మంది విద్యార్థులకు ‘సిస్కో’ శిక్షణ: లోకేశ్

image

AP: ఉన్నత, వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు IT సంస్థ సిస్కోతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. ‘నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, AI వంటి రంగాల్లో అత్యాధునిక కంటెంట్‌ను సిస్కో అందిస్తుంది. ఈ MoUతో 50K మందికి ఆ సంస్థ శిక్షణ ఇస్తుంది. మానవ వనరులకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాలను పెంచి, ఉపాధిని పెంపొందించడమే లక్ష్యం’ అని ట్వీట్ చేశారు.

error: Content is protected !!