News March 30, 2024

VIRAL.. ఓట్ల కోసం మా కాలనీలోకి రావొద్దంటూ ఫ్లెక్సీ

image

ఎన్నికల వేళ ఏలూరులో ఓ కాలనీవాసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాంతినగర్ 7వ లైన్‌‌ కాలనీవాసులు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఏ రాజకీయ పార్టీ నాయకులు తమ వీధిలోకి ఓట్లు అడగటానికి రావద్దని, 20ఏళ్ల నుంచి తమ కాలనీని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఓట్ల కోసం తప్ప గెలిచిన తర్వాత కాలనీ వైపు తొంగిచూసిన వారే లేరని, డ్రైనేజ్ తీయకపోవడంతో రోగాల బారిన పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News February 8, 2026

ఉప ఉత్పత్తులపై మిల్లర్లు దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

రైస్ మిల్లర్లు విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. పెదఅమిరంలో శనివారం రైస్ మిల్ యజమానులు, పరిశ్రమ ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. మిల్లింగ్‌లో వచ్చే ఉప ఉత్పత్తులను సరిగ్గా వినియోగిస్తే ఆర్థికంగా బలపడవచ్చని తెలిపారు. బై ప్రొడక్ట్స్ వృథా కాకుండా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను మిల్లర్లు అందిపుచ్చుకోవాలని కలెక్టర్ కోరారు.

News February 8, 2026

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: డీపీఎంవో

image

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని డీపీఎంఓ డాక్టర్‌ సీహెచ్‌ ధనలక్ష్మి హెచ్చరించారు. శనివారం భీమవరంలో నిర్వహించిన డివిజన్ స్థాయి సలహా సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను నిరంతరం తనిఖీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిని పట్టుకునేందుకు క్రమం తప్పకుండా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News February 8, 2026

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: డీపీఎంవో

image

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని డీపీఎంఓ డాక్టర్‌ సీహెచ్‌ ధనలక్ష్మి హెచ్చరించారు. శనివారం భీమవరంలో నిర్వహించిన డివిజన్ స్థాయి సలహా సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను నిరంతరం తనిఖీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిని పట్టుకునేందుకు క్రమం తప్పకుండా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.