News September 4, 2024
VIRAL: గుండెల్ని పిండేసే ఫొటో

AP: విజయవాడలో ఒక్కసారిగా ముంచెత్తిన వరదలతో నెలలు నిండిన గర్భిణులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోకి వరద చేరడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. ఓ గర్భిణి వరద ప్రవాహంలోనే కష్టంగా నడుస్తున్న ఓ ఫొటో గుండెల్ని పిండేస్తోంది. అయితే, ప్రభుత్వం ప్రత్యేకంగా ఇళ్లలో చిక్కుకున్న గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు, 10 రోజుల్లో డెలివరీ అయ్యే 154 మందిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News January 11, 2026
సంక్రాంతి సందడి.. హోటళ్లు హౌస్ఫుల్

AP: గోదావరి జిల్లాల్లో సందడి సంక్రాంతి మొదలైంది. భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, కాకినాడ, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో హోటళ్లు, లాడ్జిలు హౌస్ఫుల్ అయిపోయాయి. కోడిపందేల కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జనం తరలివస్తున్నారు. పందేల బరులు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. హోటల్ యజమానులు గదుల అద్దెను మూడు రోజులకు రూ.30-60 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
News January 11, 2026
తలనొప్పితో బాధపడుతున్నారా?

తరచూ తలనొప్పి వస్తుంటే దానికి ప్రధాన కారణం మన రోజువారీ అలవాట్లేేనని నిపుణులు అంటున్నారు. మార్నింగ్ టిఫిన్ దాటవేయడం, ఎక్కువసేపు ఆకలితో ఉండటం దీనికి ముఖ్య కారణాలు. అలాగే ఒత్తిడితో కూడిన జీవనశైలి వలన మెడ, తల కండరాలు బిగుసుకుపోయి నొప్పి వస్తుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడి అకస్మాత్తుగా తలనొప్పి వస్తుంది. బరువు తగ్గాలనే ఉద్దేశంతో సరిగ్గా తినకపోయినా, నిద్ర లేకపోయినా ఈ సమస్య వస్తుంది.
News January 11, 2026
నిర్మలా సీతారామన్కు భట్టి విక్రమార్క కీలక విజ్ఞప్తి

TG: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలను తీర్చడానికి బహిరంగ మార్కెట్ ద్వారా రూ.70,925 కోట్లు సమీకరించుకునే అనుమతి ఇవ్వాలని Dy.CM భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల కోసం వివిధ ఏజెన్సీల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంది. స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) కింద ఉన్న ఈ రుణాలను FRBM పరిధిలోకి తీసుకురావాలని అభ్యర్థించారు.


