News August 21, 2024
వైరల్ ఫీవర్స్.. ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయొద్దు

➫వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. వికారం, నీళ్ల విరేచనాలు, కీళ్ల నొప్పులు, నీరసం, దగ్గు, గొంతు నొప్పి, కళ్ల మంటలు, ముక్కు కారడం, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
➫జ్వర పీడితులు వాడే టవల్స్, సబ్బు ఇతరులు వాడకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి.
Similar News
News November 13, 2025
భూ కబ్జా ఆరోపణలు.. పవన్కు వైసీపీ సవాల్

AP: డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై భూ కబ్జా పేరిట <<18274471>>Dy.CM పవన్<<>> నిరాధార ఆరోపణలు చేస్తున్నారని YCP మండిపడింది. ‘ఈ భూములన్నీ 2000-2001 మధ్య కొన్నవి కాదా? ఇవి నిజాలు కావని నిరూపించగలరా’ అని పవన్కు సవాల్ విసురుతూ డాక్యుమెంట్ల వివరాలను Xలో షేర్ చేసింది. ‘పెద్దిరెడ్డి కుటుంబం కొనుగోలు చేసిన 75.74 ఎకరాలకు 1966లోనే రైత్వారీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా’ అని పేర్కొంది.
News November 13, 2025
కూరగాయల సాగు.. ఎకరాకు రూ.9,600 సబ్సిడీ

TG: రాష్ట్రంలో ఏటా 10వేల ఎకరాల మేర కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యానశాఖ చర్యలు చేపట్టింది. రైతులకు ఈ సీజన్ నుంచే ఎకరాకు రూ.9,600 సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేస్తోంది. అటు పలు రకాల కూరగాయల నారు కూడా సిద్ధం చేసింది. నారు అవసరం ఉన్నవారి నుంచి అప్లికేషన్లు తీసుకుంటోంది. నారు, సబ్సిడీ కావాల్సిన రైతులు సంబంధిత మండలాల్లో హార్టికల్చర్ ఆఫీసర్లకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
News November 13, 2025
శీతాకాలంలో స్కిన్ బావుండాలంటే..

చలికాలంలో చర్మం ఈజీగా పొడిబారి, పగుళ్లు వస్తాయి. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. ఈ కాలంలో మాయిశ్చరైజర్ ఎక్కువగా వాడాలి. గోరువెచ్చటి నీళ్లతోనే స్నానం చేయాలి. చర్మానికి తేమనిచ్చే సబ్బులనే వాడాలి. చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ధరించాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, తగినంత నీరు తీసుకుంటే చర్మం తేమగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


