News August 21, 2024
వైరల్ ఫీవర్స్.. ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయొద్దు

➫వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. వికారం, నీళ్ల విరేచనాలు, కీళ్ల నొప్పులు, నీరసం, దగ్గు, గొంతు నొప్పి, కళ్ల మంటలు, ముక్కు కారడం, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
➫జ్వర పీడితులు వాడే టవల్స్, సబ్బు ఇతరులు వాడకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి.
Similar News
News October 19, 2025
నేడు ఇలా చేస్తే చాలా మంచిది

నరక చతుర్దశి రోజున పొద్దున్నే లేచి, నువ్వుల నూనెతో తలంటుకుని, నెత్తిపై ఉత్తరేణి కొమ్మ ఉంచుకొని స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ‘నల్ల నువ్వులతో ‘యమాయ తర్పయామి’ అంటూ యమ తర్పణాలు వదలాలి. ఇది నరకాసురుడు మరణించిన సమయం. ఈ తర్పణం, యమధర్మరాజు శ్లోక పఠనం ద్వారా పాపాలు హరించి, నరకం నుంచి రక్షణ లభిస్తుంది. ఇంట్లో ముగ్గులు వేసి, మినప వంటకాలు తినడం శుభప్రదం’ అని సూచిస్తున్నారు.
News October 19, 2025
దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి?

దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి తన తేజస్సుతో అజ్ఞానమనే చీకటిని తరిమివేసి, భక్తులను అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పండుగ నాడు దీపాలు పెట్టి అమ్మవారిని ఆహ్వానించాలనే ఆచారాన్ని పాటిస్తున్నాం. దీనివల్ల మనపై దేవి అనుగ్రహం చూపుతారని, ఆర్థిక స్థితి మెరుగై, కుటుంబంలోని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం.
* రోజూ ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News October 19, 2025
రాష్ట్రంలో ACB మెరుపు దాడులు

TG: రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులపై ACB మెరుపు దాడులు చేపట్టింది. అర్ధరాత్రి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలోని కృష్ణా, ఆసిఫాబాద్(D)లోని వాంకిడి, సంగారెడ్డి(D)లోని జహీరాబాద్, కామారెడ్డి(D)లోని కామారెడ్డి, మద్నూరు, భద్రాద్రి(D)లోని అశ్వారావుపేట చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టి పలువురిని ప్రశ్నించింది. రవాణాశాఖ చెక్పోస్టులపై ACB ఏకకాలంలో దాడులు చేపట్టడం ఇది రెండోసారి.