News July 14, 2024

VIRAL: జగన్నాథుడే ట్రంప్‌ను రక్షించాడు

image

US మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పూరీ జగన్నాథుడే రక్షించారని పలువురు పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇదే నిజమని కోల్‌కతా ఇస్కాన్ VP రాధారమణ్ దాస్ ట్వీట్ చేశారు. 48 ఏళ్ల క్రితం న్యూయార్క్‌లో రథయాత్ర వేడుకల నిర్వహణకు అవసరమైన రథాలను తన భూమిలోనే నిర్మించుకునేందుకు ట్రంప్ అనుమతిచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో సాఫీగా సాగిందన్నారు.

Similar News

News December 6, 2025

అనకాపల్లి జిల్లా యువకుడి సూసైడ్..!

image

మాడుగుల(M) జమిదేవి పేటకు చెందిన బాలు(19)ని కుటుంబ సభ్యులు మందలించడంతో సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. బాలు గతేడాది ఇంటర్ పూర్తిచేసి ప్రస్తుతం ఊర్లో ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్థాపంతో గ్రామంలోని అతని అమ్మమ్మ ఇంటి మేడ పైన ఉరేసుకొని చనిపోయాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు శనివారం మాడుగుల ఎస్సై నారాయణరావు తెలిపారు.

News December 6, 2025

రాకెట్ వేగంతో దూసుకుపోతున్న భారత్ ‘ఫిన్‌టెక్’

image

స్కాన్.. పే.. డన్. ఈ భారత UPI చెల్లింపుల టెక్నాలజీ రాకెట్ వేగంతో గ్లోబల్ ఆధిపత్యం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఫ్రాన్స్, సింగపూర్, UAE, ఖతర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్‌లో ఇది పనిచేస్తోంది. EAST ASIA సహా మరో 8 దేశాల్లో దీని అమలుకు చర్చిస్తున్నట్లు ఫైనాన్షియల్ SEC నాగరాజు తెలిపారు. వరల్డ్ వైడ్‌గా 20+కంట్రీలను UPI ఎనేబుల్డ్‌ చేయాలన్నది లక్ష్యం. UPI USERS 50CRకి చేరగా INDIAలో 49CR ఉన్నారు.

News December 6, 2025

గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ

image

AP: విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తోన్న కృషిని CM వివరించినట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని నిర్మాణ పనుల పురోగతిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.