News September 2, 2024

VIRAL: పసికందును కాపాడిన NDRF

image

భారీ వర్షాలకు పోటెత్తిన వరదల్లో చిక్కుకున్న వారిని NDRF సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా కొందరికి లైఫ్ జాకెట్స్ అందించగా వృద్ధులు, వికలాంగులను దగ్గరుండి కాపాడుతున్నారు. అయితే, విజయవాడలో వరద నీటిలో చిక్కుకున్న తల్లి నుంచి రోజుల పసికందును NDRF సిబ్బంది కాపాడిన ఫొటో వైరలవుతోంది. ప్రాణాలకు తెగించి వరద బాధితులను రక్షిస్తున్న వారికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.

Similar News

News December 9, 2025

పేదలు, రైతుల చుట్టే నా ఆలోచనలు: CM రేవంత్

image

తన ఆలోచనలు, TG విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు పేదలు, రైతుల చుట్టే తిరుగుతాయని CM రేవంత్ అన్నారు. ‘నేను ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చా. SC, ST, BC, మైనారిటీలతో కలిసి పెరిగా. వారి సమస్యలు తెలుసు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌తో పాటు కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నాం. చైనా, జపాన్, కొరియా, సింగపూర్ మాకు రోల్ మోడల్స్. అభివృద్ధిలో వాటితో పోటీ పడతాం’ అని డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

News December 9, 2025

సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యం: CM

image

TG: నీతి ఆయోగ్, ISB, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజల సూచనలు, సలహాలతో తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. 83 పేజీలతో తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో విజన్ డాక్యుమెంట్‌ను ఆయన ఆవిష్కరించారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చామన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.

News December 9, 2025

ఇంట్లోని గుమ్మాలు, కిటికీల మాదిరిగానే స్థంభాలు కూడా సరి సంఖ్యలో ఉండాలా?

image

వాస్తు ప్రకారం గుమ్మాలు, కిటికీలతో స్థంభాలు భిన్నమైనవని, వీటి ఉపయోగాలు వేర్వేరని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘గుమ్మాలు, కిటికీలను గాలి, వెలుతురు కోసం చూస్తారు. కాబట్టి వాటి సంఖ్య విషయంలో నియమాలు ఉంటాయి. కానీ స్థంభాలు గోడల్లో కలిసిపోతాయి. పిల్లర్స్, బీమ్స్ అనేవి ఇంటి నిర్మాణంలో భవన పటిష్టతకు సంబంధించినవి. అవి సరి సంఖ్యలో ఉండాలనే నియమాలు లేవు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>