News October 24, 2024
VIRAL: నర్సరీ ఫీజు రూ.1.51లక్షలు!
ఓ ప్రైవేట్ స్కూల్లో నర్సరీకి రూ.1.51లక్షల ఫీజు అని తెలిపే ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ Xలో పోస్ట్ చేశారు. ‘ఇందులో పేరెంట్ ఓరియంటేషన్ ఫీజు రూ.8,400 అని ఉంది. డాక్టర్ కన్సల్టేషన్ కోసం ఈ ఫీజులో కనీసం 20% చెల్లించేందుకు కూడా పేరెంట్స్ ఆసక్తి చూపించరు. అందుకే నేనిప్పుడు ఓ స్కూల్ను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా’ అని ఆ డాక్టర్ పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News October 24, 2024
ఎంత తెలివి: JioHotstar.com డొమైన్ను ముందే కొనేశాడు
Jio సినిమాస్, Hotstar విలీనాన్ని ముందే ఊహించిన ఓ యాప్ డెవలపర్ <
News October 24, 2024
‘రాజాసాబ్’ మోషన్ పోస్టర్.. 24 గంటల్లో 8.3M వ్యూస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా నుంచి నిన్న మోషన్ పోస్టర్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. రిలీజైన 24 గంటల్లోనే దీనికి 8.3 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రికార్డ్స్ & ప్రభాస్ ఒకే పేజీలో ఉంటారని, యూట్యూబ్లో ఈ వీడియో ట్రెండింగ్లో ఉందని పేర్కొన్నారు.
News October 24, 2024
Stock Market: ఫ్లాట్గా ముగిశాయి
వరుస నష్టాలతో డీలాపడిన దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం ఫ్లాట్గా ముగిశాయి. 80,170 వద్ద బలమైన రెసిస్టెన్స్ను దాటలేకపోయిన సెన్సెక్స్ చివరికి 16 పాయింట్ల నష్టంతో 80,065 వద్ద స్థిరపడింది. ఉదయం అరగంట నష్టాలను 24,350 వద్ద సపోర్ట్ తీసుకొని అధిగమించిన నిఫ్టీ చివరకు 36 పాయింట్లు కోల్పోయి 24,399 వద్ద నిలిచింది. Ultratech 2.66% లాభపడగా, HindUnilvr 5.8% నష్టపోయింది.