News January 2, 2025
భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న BGT తర్వాత రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతారని జాతీయ మీడియా పేర్కొంది. సొంతగడ్డలో న్యూజిలాండ్పై, AUSలో BGT టెస్టులో పేలవ ప్రదర్శనతో శర్మపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఈక్రమంలో విరాట్ కోహ్లీ తిరిగి సారథ్యం వహించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. కోహ్లీ టెస్టు కెప్టెన్గా 68 మ్యాచులు ఆడగా భారత్ను 40 మ్యాచుల్లో గెలిపించారు.
Similar News
News January 16, 2026
ఎల్ఐసీ బిల్డింగ్ సమీపంలో వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ఆర్టీసీ కాంప్లెక్స్, ఎల్ఐసీ బిల్డింగ్ మధ్యలో ఉన్న బస్టాప్ వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయసు 75 సంవత్సరాలు దాటి ఉంటుందని ట్రాఫిక్ ఎస్ఐ సింహాచలం తెలిపారు. వైట్ షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని.. సీసీ ఫుటేజ్లు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News January 16, 2026
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజీని DFS ప్రవేశపెట్టింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులన్నీ దీన్ని అమలు చేయాలని సూచించింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కార్డుల సేవలు ఇందులో ఉంటాయి. దీనివల్ల అన్ని కేటగిరీల వారికి ₹1.5 CR-₹2 CR వరకు ప్రమాద బీమా కవర్ కానుంది. వైకల్యం ఏర్పడితే ₹1.5CR అందుతుంది. జీరో బ్యాలెన్స్, తక్కువ వడ్డీకే హౌసింగ్, ఎడ్యుకేషన్, వెహికల్, పర్సనల్ రుణాలు అందుతాయి.
News January 16, 2026
పద్ధతిగా ఉండమంటే కేసు పెడతారా?: సంధ్య

TG: తన వ్యాఖ్యలపై నటి అనసూయ <<18872663>>కేసు<<>> పెట్టడంపై కాంగ్రెస్ నేత బొజ్జ సంధ్య స్పందించారు. ‘పద్ధతిగా ఉండాలని చెబితే కేసు పెడతారా? కేసులు ఎదుర్కొనే దమ్ము నాకు ఉంది. SMలో తల్లిదండ్రులు నా దృష్టికి తెచ్చిన విషయాన్నే ప్రస్తావించా. స్వేచ్ఛ అంటే మగవారితో సమానంగా ఆర్థికంగా ఎదగడమే. దుస్తుల్లో స్వేచ్ఛలేదు’ అని ఆమె స్పష్టం చేశారు. కాగా అనసూయ ఫిర్యాదుతో వివిధ ఛానళ్ల యాంకర్లు సహా 73 మందిపై కేసు నమోదైంది.


