News September 20, 2024
విరాట్ కోహ్లీ అరుదైన ఘనత
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించారు. సొంత గడ్డపై అత్యధిక పరుగులు పూర్తి చేసుకున్న ఐదో బ్యాటర్గా రికార్డులకెక్కారు. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన 12,000 పరుగుల మైలురాయి చేరుకుని ఈ ఫీట్ సాధించారు. అగ్ర స్థానంలో సచిన్ టెండూల్కర్ (14,192) ఉన్నారు. ఆ తర్వాత రికీ పాంటింగ్ (13,117), జాక్వెస్ కలిస్ (12,305), కుమార సంగక్కర (12,043) నిలిచారు.
Similar News
News September 20, 2024
విరాట్ తప్పిదం.. నాటౌటైనా పెవిలియన్కు!
బంగ్లాతో తొలి టెస్టులో భారత్ పట్టు సాధించింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో జోరు మీదున్న విరాట్ స్వీయ తప్పిదంతో పెవిలియన్ చేరారు. హసన్ వేసిన బంతి ఆయన బ్యాట్కు తగులుతూ ప్యాడ్ను తాకింది. అంపైర్ LBWగా ఔటిచ్చారు. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న గిల్తో మాట్లాడి కోహ్లీ వెనుదిరిగారు. రీప్లేలో బాల్ ఆయన బ్యాట్కు తాకినట్లుగా తేలింది. అది చూసి కెప్టెన్ రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి అసహనం వ్యక్తం చేశారు.
News September 20, 2024
బుమ్రా @ది వరల్డ్ క్లాస్ ప్లేయర్!
చెన్నై వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో టీమ్ఇండియా పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పడగొట్టిన నాలుగు వికెట్లు బంగ్లాను తక్కువ మొత్తానికే ఆలౌట్ చేసేందుకు తోడ్పడ్డాయి. సొంతగడ్డపై బుమ్రా ఇప్పటివరకు 9 టెస్టులు ఆడగా 15.94 సగటు& 32.4 స్ట్రైక్ రేట్తో 37 వికెట్లు తీశారు. ప్రపంచ క్రికెట్లో బుమ్రా అత్యుత్తమ ఆటగాడని మరోసారి నిరూపించాడని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
News September 20, 2024
నేటి కాంగ్రెస్లో దేశభక్తి స్ఫూర్తి చచ్చిపోయింది: మోదీ
విదేశీ గడ్డపై దేశాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. నేటి కాంగ్రెస్లో దేశభక్తి స్ఫూర్తి చచ్చిపోయిందని ఆయన మండిపడ్డారు. ‘పరాయి గడ్డపై కాంగ్రెస్ వాళ్ల భాష, దేశ వ్యతిరేక ఎజెండా, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే మాటలను చూడండి. ఇది ‘తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్ నడుపుతున్న కాంగ్రెస్’ అంటూ ప్రధాని మండిపడ్డారు. మహారాష్ట్రలోని వార్ధ సభలో ఆయన మాట్లాడారు.