News September 30, 2024

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

image

టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ చరిత్ర లిఖించారు. బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో 27వేల పరుగుల మైలురాయిని చేరుకున్నారు. అన్ని ఫార్మాట్లు కలిపి సచిన్ 623 ఇన్నింగ్స్‌‌లలో ఈ ఘనత సాధించగా విరాట్ 594 ఇన్నింగ్స్‌లలోనే ఆ మార్కును చేరుకున్నారు. క్రికెట్ చరిత్రలో ఇంత వేగంగా ఈ ఘనత సాధించింది విరాట్ ఒక్కరే. సచిన్, కోహ్లీతో పాటు రికీ పాంటింగ్, సంగక్కర కూడా 27వేల పరుగుల మైలురాయి దాటారు.

Similar News

News November 25, 2025

ఇవాళ ఉదయం 10 గంటలకు

image

వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇవాళ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల కోటా(రూ.300)ను టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను రిలీజ్ చేయనుంది. టికెట్ల కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని TTD తెలిపింది. దళారులను నమ్మి మోసపోవద్దని, నకిలీ వెబ్ సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

News November 25, 2025

‘MTU 1426’ వరి వంగడం ప్రత్యేకతలు

image

‘MTU 1426’ వరి వంగడాన్ని MTU 1121, NLR 34449 రకాలను సంకరం చేసి అభివృద్ధి చేశారు. బియ్యం పారదర్శకంగా, పొట్ట తెలుపు లేకుండా ఉంటుంది. దిగుబడి హెక్టారుకు 6.5- 7 టన్నుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రకానికి గింజ రాలడం బాగా తక్కువ. గింజలు చేనుపై మొలకెత్తవు. అన్నం మృదువుగా ఉండి తినడానికి అత్యంత అనుకూలం. అగ్గితెగులు, ఎండాకు తెగులు, ఉల్లికోడును కొంత మేర తట్టుకుంటున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.

News November 25, 2025

ఇతిహాసాలు క్విజ్ – 77

image

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>