News April 1, 2025
A+ కాంట్రాక్టులోనే విరాట్, రోహిత్?

విరాట్, రోహిత్ను A+ గ్రేడ్లోనే కొనసాగించాలని BCCI భావిస్తున్నట్లు సమాచారం. మూడు ఫార్మాట్లలోనూ ఆడే క్రికెటర్లకే బీసీసీఐ A+ గ్రేడ్ను కేటాయిస్తోంది. రోహిత్, కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో వారి గ్రేడ్ను తగ్గించొచ్చని వార్తలు వచ్చాయి. అయితే, భారత క్రికెట్కు వారందించిన సేవల దృష్ట్యా అగ్రస్థాయి కాంట్రాక్ట్లోనే కొనసాగించాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 10, 2025
నేపాల్ తాత్కాలిక PMగా సుశీల!

నేపాల్ తాత్కాలిక PMగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ పేరును ఆందోళనకారులు ప్రతిపాదించారు. Gen-Z గ్రూప్తో వర్చువల్గా సమావేశమైన సుశీల తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆమె నేతృత్వంలో ఆర్మీ చీఫ్తో చర్చలకు నిరసనకారులు సిద్ధమయ్యారు. రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్న యువత ఈ చర్చల్లో పాల్గొనొద్దన్న నిబంధనకు Gen-Z గ్రూప్ అంగీకరించినట్లు తెలుస్తోంది.
News September 10, 2025
₹1.56 లక్షలకు తగ్గనున్న బుల్లెట్ బైక్ ధర!

GST సవరణ నేపథ్యంలో తమ కంపెనీ బైక్స్ ధరలను తగ్గించినట్లు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది. దీంతో ఈనెల 22 నుంచి 350cc కెపాసిటీ మోడల్స్ ధరలు ₹22 వేల వరకు తగ్గనున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350(బేస్ మోడల్) ఎక్స్ షోరూమ్ రేట్ ₹1.56 లక్షలు, క్లాసిక్ 350 రేట్ ₹1.77 లక్షలు, హంటర్ 350 ధర కనిష్ఠంగా ₹1.27 లక్షలకు తగ్గే అవకాశం ఉంది. అటు 350cc కెపాసిటీకి మించిన అన్ని రకాల మోడల్స్ రేట్స్ భారీగా పెరగనున్నాయి.
News September 10, 2025
ప్రాక్టీస్ షురూ చేసిన హిట్మ్యాన్

టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోసం రెడీ అవుతున్నారు. తాజాగా ముంబైలో ప్రాక్టీస్ ప్రారంభించారు. అభిషేక్ నాయర్ ట్రైనింగ్లో బరువు తగ్గిన రోహిత్.. రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో మూడు వన్డేలు జరగనున్నాయి. అటు 2027 వన్డే ప్రపంచకప్ వరకు హిట్మ్యాన్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.