News May 7, 2025

విరాట్ అనవసరంగా రిటైర్ అయ్యారు: రైనా

image

టీ20Iల నుంచి కోహ్లీ అనవసరంగా రిటైరయ్యారని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డారు. ‘కనీసం 2026 T20 వరల్డ్ కప్ వరకూ కోహ్లీ ఆడాల్సింది. IPLలో అతడి ఫిట్‌నెస్ స్థాయులు, ఆడే విధానం చూస్తుంటే తొందరపడ్డారనే అనిపిస్తోంది. ఆయనింకా తన అత్యుత్తమ దశలోనే ఉన్నారు. మరికొంత కాలం కొనసాగాల్సింది’ అని పేర్కొన్నారు. IPL-2025లో కోహ్లీ ఇప్పటి వరకు 392 రన్స్‌ చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నారు.

Similar News

News March 17, 2026

పాక్ దాడి పిరికిపంద చర్య: భారత్

image

అఫ్గానిస్థాన్‌లోని ఆస్పత్రిపై <<19403539>>పాకిస్థాన్ దాడిని<<>> భారత్ ఖండించింది. రంజాన్ వేళ ఇలా చేయడం దారుణమని మండిపడింది. దీన్ని అఫ్గాన్ సార్వభౌమత్వంపై దాడిగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఇది మిలిటరీ దాడి కాదు మారణహోమమని పేర్కొంది. ఇదొక పిరికిపంద చర్యగా అభివర్ణించింది. కాగా పాక్ దాడిలో దాదాపు 400 మంది అమాయకులు మరణించారు.

News March 17, 2026

KTR వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్

image

TG: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు <<19405508>>ఎందుకు<<>> చెప్పాలన్న KTR వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వనందుకు, మేం కొత్త కార్డులతో పాటు సన్నబియ్యం ఇస్తున్నందుకు KTR ధన్యవాదాలు చెప్పాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నందుకు థాంక్స్ చెప్పాలి’ అని స్పష్టం చేశారు.

News March 17, 2026

పెద్దల రుణాలు రైటాఫ్.. పేదల అప్పులపై కఠినం.. కావాలి మానవత్వం!

image

పేదలు, రైతులు తీసుకొన్న అప్పులను ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకులు ‘పెద్దల’ రుణాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నాయి. 11 ఏళ్లలో ఏకంగా రూ.9.75 లక్షల కోట్ల అప్పులను రైటాఫ్ చేసినట్లు కేంద్రం పార్లమెంటులో చెప్పడంతో చర్చ మొదలైంది. పేదల రుణాల వసూళ్లలోనూ మానవత్వంతో సున్నితంగా వ్యవహరించాలని పలువురు పేర్కొంటున్నారు. కట్టడం ఆలస్యమైతే వడ్డీల బాదుడు నుంచి విముక్తి కలిగించాలంటున్నారు. మీరేమంటారు?