News August 28, 2024

అమెరికాలో దోమకాటుతో వైరస్.. కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్!

image

అమెరికాలో దోమకాటు వల్ల ‘ఈస్టర్న్ ఈక్విన్ ఎన్‌సెఫలైటిస్’ అనే వైరస్ సోకి ఓ వ్యక్తి మరణించడంతో ఆ దేశ పాలనా విభాగం అలర్ట్ అయింది. మసాచుసెట్స్, వెర్మాంట్ తదితర ప్రాంతాల్లో అనధికార లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. పార్కులు, పబ్లిక్ ఈవెంట్లపై నిషేధం విధించారు. హెలికాప్టర్లతో మందులు పిచికారీ చేస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, డయేరియా, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి వ్యాక్సిన్ లేదు.

Similar News

News October 17, 2025

ఉపరాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపు

image

చెన్నైలోని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆయన ఇంట్లో బాంబు పెట్టామంటూ దుండగులు మెయిల్ పంపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.

News October 17, 2025

ఆర్మీ క్యాంప్‌పై ‘ఉల్ఫా’ అటాక్

image

అస్సాంలో ఉల్ఫా మిలిటెంట్లు రెచ్చిపోయారు. తిన్‌సుకియా జిల్లాలోని కాకోపతార్ ప్రాంతంలో ఆర్మీ క్యాంప్‌పై అర్ధరాత్రి అటాక్ చేశారు. గ్రెనేడ్లు విసిరి తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ట్రక్కులో వచ్చిన మిలిటెంట్లు సుమారు 30 నిమిషాల పాటు దాడులు చేసి పారిపోయారు. దీంతో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు స్థానిక అడవుల్లో మిలిటెంట్ల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.

News October 17, 2025

ప్రిన్సిపల్ చనిపోయారంటూ ఫేక్ లెటర్.. చివరికి

image

పరీక్షల వాయిదా కోసం ఇద్దరు విద్యార్థులు బరితెగించారు. MP ఇండోర్‌ ప్రభుత్వ హోల్కర్ సైన్స్ కాలేజీలో BCA చదువుతున్న వారు కళాశాల లెటర్ హెడ్ సంపాదించారు. ప్రిన్సిపల్ అనామిక హఠాత్తుగా చనిపోయారని, ఈనెల 15,16న జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాసి SMలో వైరల్ చేశారు. అసలు విషయం బయటపడటంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. కాలేజీ 60రోజులు సస్పెండ్ చేసింది. ఇద్దరికీ మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది.