News March 19, 2024

విరుష్క జంట బ్రిటన్‌లో సెటిల్?

image

టీమ్ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు బ్రిటన్‌లో సెటిల్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్క చాలా కాలం నుంచి అక్కడే ఉంటున్నారు. రెండో బిడ్డ అకాయ్‌కూ అక్కడే జన్మనిచ్చారు. పిల్లల ప్రైవసీ కోసం ఈ జంట అక్కడే సెటిల్ కావాలనుకుంటున్నట్లు సమాచారం. భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా అక్కడి పౌరసత్వం పొందనున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ మ్యాచ్‌లకు మాత్రమే కోహ్లీ ఇండియాకు వస్తారని టాక్.

Similar News

News November 14, 2025

స్థానిక ఎన్నికలు BRSకు అగ్నిపరీక్షేనా!

image

TG: ‘జూబ్లీహిల్స్’ గెలుపు జోష్‌లో ఉన్న CONG అదే ఊపులో లోకల్ బాడీలనూ ఊడ్చేయాలని రెడీ అవుతోంది. త్వరలో రూరల్, అర్బన్ సంస్థల ఎలక్షన్స్ రానున్నాయి. ‘జూబ్లీ’ ఓటమితో నిరాశలో ఉన్న BRSకు ఇవి అగ్ని పరీక్షేనన్న చర్చ ఆ పార్టీలో నెలకొంది. ‘జూబ్లీ’ ప్రభావం స్థానిక ఎన్నికలపై పడుతుందని, ఈ తరుణంలో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నాయకులు, శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపడం సవాలుగా మారుతుందని భావిస్తున్నారు.

News November 14, 2025

సుపరిపాలన, అభివృద్ధి విజయమిది: మోదీ

image

బిహార్ ఎన్నికల్లో విజయంపై PM మోదీ స్పందించారు. ‘సుపరిపాలన, అభివృద్ధి, ప్రజానుకూల స్ఫూర్తి, సామాజిక న్యాయం గెలిచింది. చరిత్రాత్మక, అసమాన గెలుపుతో NDAను ఆశీర్వదించిన బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజలకు సేవ చేసేందుకు, బిహార్ కోసం పని చేసేందుకు ఈ తీర్పు మాకు మరింత బలాన్నిచ్చింది’ అని ట్వీట్ చేశారు. తమ ట్రాక్ రికార్డు, రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే తమ విజన్ ఆధారంగా ప్రజలు ఓటేశారని తెలిపారు.

News November 14, 2025

ఇతిహాసాలు క్విజ్ – 66 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: విదురుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించకుండా ‘మంత్రి’ పాత్రకే ఎందుకు పరిమితమయ్యారు?
జవాబు: ధృతరాష్ట్రుడు, పాండురాజు.. ఈ ఇద్దరూ అంబిక, అంబాలిక గర్భాన జన్మించారు. కానీ, విదురుడు దాసి గర్భాన జన్మించడం వలన, ఆనాటి రాజ్యాంగ నియమం ప్రకారం సింహాసనాన్ని అధిష్ఠించే అర్హతను కోల్పోయి, మంత్రి పాత్రకే పరిమితం అయ్యారు.
<<-se>>#Ithihasaluquiz<<>>