News December 22, 2024
మలేషియాలోకి భారతీయుల వీసా ఫ్రీ ఎంట్రీ గడువు పెంపు

భారత్, చైనా పౌరులకు వీసా రహిత ఎంట్రీ గడువును మలేషియా 2026, డిసెంబరు 21 వరకూ పొడిగించింది. పర్యాటకానికి ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ సెక్రటరీ జనరల్ దాటుక్ అవాంగ్ అలీక్ జెమాన్ ప్రకటించారు. భారత్తో పాటు చైనా పౌరులకు వీసా ఫ్రీ ఎంట్రీని గత ఏడాది డిసెంబరు 1న మలేషియా అనౌన్స్ చేసింది. దీని ప్రకారం వీసా లేకుండా నెలరోజుల పాటు ఈ దేశాల పౌరులు మలేషియాలో పర్యటించవచ్చు.
Similar News
News January 19, 2026
మళ్లీ పెరిగిన బంగారం ధర!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18894920>>మళ్లీ<<>> పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.2,460 పెరిగి రూ.1,46,240కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,250 ఎగబాకి రూ.1,34,050 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.8వేలు పెరిగి రూ.3,18,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 19, 2026
కొత్త ట్రెండ్.. పదేళ్లలో ANY CHANGE?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘2016 Vs 2026’ ఛాలెంజ్ తెగ ట్రెండ్ అవుతోంది. పదేళ్ల కాలంలో తమ రూపం ఎంతలా మారిందో చూపేలా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ పాత, కొత్త ఫొటోలతో పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా సినీ తారల మేకోవర్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు కరీనా, అనన్య, సోనమ్ కపూర్ సైతం వారి ఓల్డ్ ఫొటోస్ షేర్ చేయడంతో వైరల్గా మారాయి. ఈ ట్రెండ్ను మీరూ ట్రై చేశారా?
News January 19, 2026
ఏ చర్మానికి ఏ ఫేస్వాష్ వాడాలంటే..

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఫేస్వాష్లు ఉన్నాయి. వీటిల్లో మీ చర్మానికి సరిపోయేదాన్ని ఎంచుకోవాలి. హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, నియాసినమైడ్ కలిగి ఉన్న ఫేస్వాష్లు చర్మానికి మేలు చేస్తాయి. ఇవి ముఖానికి తేమను అందించి పొడిదనాన్ని తగ్గిస్తాయి. ఆయిలీ స్కిన్ ఉన్నవారు సాలిసిలిక్ యాసిడ్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిగిన ఫేస్వాష్, డ్రై స్కిన్ ఉన్నవారు ఆల్మండ్, ఆలీవ్ ఆయిల్ ఉన్న ఫేస్వాష్ ఉపయోగిస్తే మంచిది.


