News November 2, 2024
విశాఖ TO అమరావతి 2 గంటల్లో వెళ్లేలా..: CM

AP: విశాఖ నుంచి అమరావతికి 2 గంటల్లో వెళ్లేలా రోడ్లను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. నేషనల్ హైవేలపై ఐదేళ్లలో రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామన్నారు. రాష్ట్రంలో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు నాంది పలుకుతున్నామని, సంపద సృష్టించాలంటే మౌలిక సదుపాయాలు పెంచాలని పేర్కొన్నారు. నక్కపల్లి వద్ద రూ.70వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారని తెలిపారు.
Similar News
News November 5, 2025
133 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

చెన్నైలోని ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (<
News November 5, 2025
7 బిలియన్ ఏళ్ల కిందట విశ్వం టెంపరేచర్ ఎంత?

‘బిగ్ బ్యాంగ్’ ప్రకారం 13.8బిలియన్ ఏళ్ల కిందట ఏర్పడిన విశ్వంలో ఎన్నో అద్భుతాలు, రహస్యాలున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని జపాన్ సైంటిస్టులు కనుగొన్నారు. ఈ యూనివర్స్ టెంపరేచర్ ప్రస్తుతం 2.7K(కెల్విన్) ఉండగా, 7B ఏళ్ల కిందట 5.13 కెల్విన్(−268°C) ఉండేదని తేల్చారు. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ పరిశీలనలు.. విశ్వం క్రమంగా చల్లబడుతోందనే అంచనాలను ధ్రువీకరిస్తున్నాయి.
* సెల్సియస్= కెల్విన్-273.15
News November 5, 2025
భరణి నక్షత్రంలో కార్తిక పౌర్ణమి విశిష్టత

సాధారణంగా కార్తిక పౌర్ణమి కృత్తిక నక్షత్రంతో శ్రేష్ఠమైనది. కానీ ఈ ఏడాది భరణి నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చింది. దీనికి ప్రత్యేక స్థానం ఉందని పండితులు చెబుతున్నారు. ‘ఈ పౌర్ణమి+భరణి కలయిక పాపాలను పోగొట్టి, మోక్షాన్ని, పితృదేవతల ప్రసాదాన్ని ఇస్తుంది. నేడు చేసే దీపదానం, పితృతర్పణం, గంగాస్నానం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది. కృత్తిక జ్ఞాన ప్రకాశాన్నిస్తే భరణి పాప నాశనం చేస్తుంది’ అంటున్నారు.


