News September 22, 2025
2028 నాటికి విశాఖ, విజయవాడ మెట్రోలు

AP: మెట్రో రైల్ టెండర్లలో గరిష్ఠంగా 3 కంపెనీల JVలకు అవకాశం కల్పిస్తున్నట్లు APMRCL MD రామకృష్ణారెడ్డి తెలిపారు. విశాఖ 46.23 కి.మీ, విజయవాడ 38 కి.మీల మేర పనుల్లో 40 శాతం సివిల్ వర్కులకు టెండర్లు పిలిచామన్నారు. OCT 10లోగా విశాఖకు, 14లోగా విజయవాడకు టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులు రికార్డు టైమ్లో 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యాన్ని పెట్టుకున్నామని వివరించారు.
Similar News
News September 22, 2025
రైల్నీర్ వాటర్ బాటిల్ @రూ.14

GST శ్లాబుల సవరణలతో ఇవాళ్టి నుంచి రైళ్లలో లభించే రైల్నీర్ వాటర్ బాటిల్ ధరను రైల్వే శాఖ తగ్గించింది. ఇప్పటివరకూ 1L బాటిల్పై రూ.15గా ఉన్న ధర రూ.14కు తగ్గింది. అలాగే గతంలో రూ.10గా ఉన్న 500 మి.లీ. బాటిల్ ₹9కే లభించనుంది. అయితే ఎక్కువ ధరలకు విక్రయిస్తే 139కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ప్రతి రూపాయి ముఖ్యమే కాబట్టి తగ్గిన ధరలను గమనించి చిల్లరను అడిగి తీసుకోండి. SHARE IT
News September 22, 2025
NIRDPRలో ఉద్యోగాలు

HYDలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్(<
News September 22, 2025
నవరాత్రి ఉత్సవాలు.. ఉపవాసం ఉంటున్నారా?

నవరాత్రుల సందర్భంగా వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఉపవాసం ఉంటారు. అయితే సరైన జాగ్రత్తలు పాటించకపోతే త్వరగా అలసిపోవడం, తల తిరగడం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండ్లు తినడం, రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగడం, ఫైబర్, ప్రొటీన్, ఆహారంలో కార్బోహైడ్రేట్స్ సమపాళ్లలో ఉండేలా చూసుకోవడం వంటి చిట్కాల ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు.