News April 24, 2024

విశాఖను గంజాయి హబ్‌గా మార్చారు: CBN

image

AP: విశాఖను CM జగన్ గంజాయి హబ్‌గా మార్చారని TDP అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు విశాఖలో ఉండటం బాధాకరం. ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా భూ మాఫియా, సెటిల్‌మెంట్లే. రాక్షస మాఫియా వచ్చి విశాఖను నాశనం చేస్తోంది. ఉత్తరాంధ్రలో వేల కోట్ల ఆస్తులు కొట్టేశారు. ఎవరివల్ల రాష్ట్రం బాగుంటుందో ప్రజలు ఆలోచించాలి. మేం రాగానే మెగా DSCపైనే తొలి సంతకం ‘ అని శృంగవరపుకోట సభలో స్పష్టం చేశారు.

Similar News

News December 6, 2025

గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగించనున్న ప్రముఖులు

image

TG: ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్-2047 తొలి రోజు పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా మాట్లాడనున్నారు. ఈ నెల 8న మధ్యాహ్నం ప్రారంభమయ్యే సమ్మిట్ 9న రాత్రి ముగియనుంది.

News December 6, 2025

రేపు జాగ్రత్త.. ఈ జిల్లాలకు YELLOW ALERT

image

TG: రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే 3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతలగాలులు వీస్తాయని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News December 6, 2025

భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

image

దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచులో టీమ్ ఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు 270 రన్స్ చేయగా IND మరో 10.1 ఓవర్లు ఉండగానే టార్గెట్ ఛేదించింది. రోహిత్(75), జైస్వాల్(116*) తొలి వికెట్‌కు 155 పరుగులు జోడించారు. హిట్ మ్యాన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ(65*)తో కలిసి జైస్వాల్‌ INDకు విజయాన్ని అందించారు. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.