News March 18, 2024

విశాఖ: నేడే ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

విశాఖ జిల్లాలో నేటి నుంచి ఓపెన్ స్కూల్ లో 10వ తరగతి ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2: 30 గంటల నుంచి 5: 30 గంటల వరకు ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. 10వ తరగతికి 986 మంది, ఇంటర్ కు 1215 మంది విద్యార్థులు హాజరవుతారని డీఈవో చంద్రకళ తెలిపారు. వీరి కోసం 11 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

Similar News

News October 20, 2025

విశాఖలో అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె

image

వాల్తేరు డిపోలో అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె ఆదివారం కూడా కొనసాగింది. ఈ మేరకు డిపోకు చెందిన 29 బస్సులు నిలిచిపోయాయి. కార్యదర్శి బి.జంపన్న మాట్లాడుతూ.. రూ.26,000కి జీతం పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలన్నారు. నైట్ హాల్ట్ అలవెన్సులు, దసరా బోనస్, రెండు జతల బట్టలు ఇవ్వాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న రూ.18వేల జీతంతో జీవనం కష్టంగా ఉందని వాపోయారు. జీతాలు పెంచే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.

News October 19, 2025

విశాఖ: రేపు కలెక్టరేట్‌లో PGRS రద్దు

image

దీపావళి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో సోమవారం విశాఖ కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదివారం తెలిపారు. అధికారులు ఎవరూ అందుబాటులో ఉండరని, కావున ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. వచ్చేవారం యథావిధిగా వినతుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.

News October 19, 2025

21న విశాఖ రానున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి

image

మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మంగళవారం విశాఖ రానున్నారు. ఆరోజు ఉదయం 4:35 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి సర్క్యూట్ హౌస్‌కి వెళ్తారు. ఉదయం 9:30 గంటలకు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం జీవీఎంసీలో జరిగే రివ్యూలో పాల్గొని ఆరోజు సాయంత్రం 7 గంటలకు ట్రైన్‌లో బయలుదేరి ఒంగోలు వెళ్తారు.