News November 10, 2024
విశాఖ రైల్వే జోన్ పనులు త్వరలో ప్రారంభం: కేంద్ర మంత్రి

AP: విశాఖ రైల్వే జోన్ కోసం స్థలం కేటాయింపులు జరిగాయని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో బీజేపీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్ సత్తుపల్లి వరకు పూర్తయిందని, అతి త్వరలో మిగిలిన పనులు పూర్తి చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే యోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు.
Similar News
News February 6, 2026
2,325 ఎస్జీటీ పోస్టులు రద్దు!

TG: ప్రభుత్వ స్కూళ్లలో 2,325 సాంక్షన్ ఎస్జీటీ పోస్టుల రద్దుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కొత్తగా 2,064 పోస్టుల కోసం పాత సాంక్షన్ పోస్టులను సరెండర్ చేయాలని ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం 261 HM, 1,803 పీఈటీ పోస్టులు అవసరం ఉండగా క్యాడర్ను బట్టి ఉన్న పోస్టులను సరెండర్ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా నల్గొండలో 407, హైదరాబాద్లో 306 ఎస్జీటీ పోస్టులు మిగులుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
News February 6, 2026
ఢిల్లీ క్యాపిటల్స్కు హార్ట్ బ్రేక్

గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అని నానుడి. DCకి ఇది సరిగ్గా సరిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు ఫైనల్ చేరిన ఆ జట్టుకు అన్నిసార్లు పరాభవమే ఎదురైంది. నిన్నటి మ్యాచులో బ్యాటర్లు రాణించినా బౌలర్లు తేలిపోవడంతో ప్రత్యర్థి విజేతగా నిలిచింది. దీంతో WPL ట్రోఫీ గెలిచేందుకు ఆ జట్టుకు మరో సీజన్ వరకు ఎదురుచూపులే మిగిలాయి. IPLలోనూ ఇంతవరకు DC టైటిల్ గెలవకపోవడం తెలిసిందే.
News February 6, 2026
AA22: నెగటివ్ రోల్లో రష్మిక?

పుష్పలో అల్లు అర్జున్కు జోడీగా నటించిన రష్మిక ఇప్పుడు సరికొత్త రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న AA22లో ఆమె నెగటివ్ రోల్లో కనిపిస్తారని చర్చ జరుగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక ‘మైసా’, ‘రణబాలి’ చిత్రాల్లో నటిస్తున్నారు.


