News March 26, 2025
తలసరి ఆదాయంలో విశాఖ ఫస్ట్.. శ్రీకాకుళం లాస్ట్: సీఎం

AP: రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తలసరి ఆదాయంలో విశాఖ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో, శ్రీకాకుళం లాస్ట్ ప్లేస్లో ఉందని చెప్పారు. రాష్ట్ర సగటు కన్నా విశాఖ తలసరి ఆదాయం ఎక్కువని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కలెక్టరేట్లతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.
Similar News
News February 24, 2026
కలుపు తీయనివాడు కోత కోయడు

సాగులో ప్రధాన పంటతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. రైతులు సరైన సమయంలో కలుపును తొలగించకపోతే, అది ప్రధాన పంటకు చేరాల్సిన పోషకాలను లాగేసుకొని పంట సరిగా పెరగదు. నిర్లక్ష్యం చేస్తే రైతుకు కోసేందుకు పంట కూడా మిగలదు. అలాగే నిజ జీవితంలో కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఆ దారిలో ఎదురయ్యే ఆటంకాలను (కలుపును) ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని ఈ సామెత తెలియజేస్తుంది.
News February 24, 2026
పూజ ఇలా అస్సలు చేయకూడదు: పండితులు

ఖాళీ నుదుటితో దైవకార్యాలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకూడదని, ఇది అశుభాన్ని ప్రేరేపిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘పూజా సమయంలో నుదుట బొట్టు తప్పనిసరి. విభూతి అయినా ధరించవచ్చు. తిలకధారణ ఏకాగ్రతను పెంచి, సాత్విక శక్తిని ప్రసాదిస్తుంది. లేకపోతే పూజ నిష్ఫలమవుతుంది. పూజలో పాల్గొనేటప్పుడు దైవత్వం కలగాలన్నా, స్వామి అనుగ్రహం పొందాలన్నా నుదుట తిలకధారణ తప్పనిసరి’ అని అంటున్నారు.
News February 24, 2026
నేను ఎంతకాలం ఉంటానో తెలీదు.. ప్రాణహానిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

ఫ్లోరిడాలోని ట్రంప్ రిసార్ట్లోకి చొరబడటానికి యత్నించిన ఓ దుండగుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందిస్తూ ట్రంప్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఎంతకాలం ఇక్కడ ఉంటానో నాకు తెలీదు. చాలామంది నన్ను టార్గెట్ చేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రభావవంతమైన నేతలపైనే ఇలాంటి దాడులు జరుగుతాయంటూ లింకన్, కెన్నెడీ వంటి వారిని అందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు.


