News April 15, 2025
రేపటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమ్మె

AP: రేపటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. తొలగించిన కార్మికులను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని యాజమాన్యాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. 14 వేల మంది సమ్మెలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ముందు జాగ్రత్తగా రెగ్యులర్ ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది.
Similar News
News April 18, 2025
రాష్ట్రానికి రూ.28,842 కోట్ల మద్యం ఆదాయం

AP: ఈ ఏడాది రాష్ట్రానికి మద్యం అమ్మకాల ద్వారా భారీ ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2024-25 ఏడాదికిగానూ రూ.28,842 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. పన్నుల రూపంలో రూ.24,731 కోట్లు, వైన్స్, బార్లు, డిస్టిలరీల లైసెన్స్ ఫీజుల రూపంలో రూ.2,206 కోట్లు, దరఖాస్తు రుసుముల రూపంలో రూ.1,905 కోట్లు వచ్చినట్లు వివరించింది. ఈ ఏడాది మద్యం అమ్మకాల్లో 14 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది.
News April 18, 2025
స్టేషన్ల సుందరీకరణ కాదు.. రైళ్లను పెంచండి: నెటిజన్లు

అమృత్ భారత్ స్కీమ్ కింద కేంద్రం రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. TGలోని సికింద్రాబాద్, బేగంపేట, వరంగల్ తదితర రైల్వే స్టేషన్లను సుందరీకరిస్తున్నారు. అయితే, దీనిపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ట్రాక్స్ను పునరుద్ధరించడం, మరిన్ని రైళ్లను పెంచడానికి బదులుగా స్టేషన్ల కోసం ఖర్చు చేస్తున్నారని ట్వీట్స్ చేస్తున్నారు. సీట్ల లభ్యత, ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News April 18, 2025
చైనాతో మంచి డీల్ చేసుకుంటాం: ట్రంప్

వాణిజ్యంపై త్వరలోనే చైనాతో మంచి ఒప్పందం చేసుకుంటామని US అధ్యక్షుడు ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే యూరప్తోపాటు ఇతర దేశాలతో డీల్ చేసుకోవడంలో కొంత సమస్య ఉందన్నారు. ఇటాలియన్ ప్రధానమంత్రి వైట్ హౌస్ పర్యటన సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. కాగా అమెరికా-చైనా మధ్య ప్రస్తుతం ట్రేడ్ వార్ నడుస్తోంది. డ్రాగన్ వస్తువులపై US ఏకంగా 245శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే.