News April 16, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె వాయిదా

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె వాయిదా పడింది. రీజనల్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చల్లో తమకు నెల గడువు కావాలని యాజమాన్యం కోరింది. అలాగే సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ ప్రతిపాదనలను అంగీకరించిన కమిషనర్ యథాతథ స్థితి కొనసాగించాలని నిర్ణయించింది. తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలనే తదితర డిమాండ్లతో కార్మికులు సమ్మె చేయాలని భావించిన విషయం తెలిసిందే.

Similar News

News April 16, 2025

బాలీవుడ్‌లోకి ధోనీ ఎంట్రీ?

image

బాలీవుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ చేసిన ఓ పోస్టుతో క్రికెటర్ <>ధోనీ<<>> బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహీ ఓ రొమాంటిక్ రోల్‌లో కనిపించబోతున్నారని అందులో ఆయన రాసుకొచ్చారు. ఆ వీడియోలో ధోనీ లవ్ సింబల్ బెలూన్ పట్టుకొని కనిపించారు. దీంతో ఈ స్టార్ క్రికెటర్‌ను కరణ్ బాలీవుడ్‌లో లాంచ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇది ఓ యాడ్ షూటింగ్ అని కొందరు చెబుతున్నారు.

News April 16, 2025

GREAT: ఆ రెండు ఘనతలూ పంజాబ్‌వే..

image

IPL-2025: KKRతో జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో <<16112256>>PBKS<<>> అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాను 95 పరుగులకే కట్టడి చేసింది. IPLలో ఇంత తక్కువ స్కోరు(111)ను కాపాడుకోవడం ఇదే తొలిసారి. కాగా, ఇదే పంజాబ్ 2024 సీజన్లో KKRపై 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది. ఆ మ్యాచ్‌లో బెయిర్‌స్టో సెంచరీతో చెలరేగారు. ఆ గేమ్ మీకు గుర్తుంటే COMMENT చేయండి.

News April 16, 2025

పోలీసుల పనితీరులో దేశంలోనే తెలంగాణ టాప్

image

పోలీసు విభాగం పనితీరుకు సంబంధించి ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం తెలంగాణ 6.48 పాయింట్లతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఈ కేటగిరిలో 6.44Pతో ఏపీ రెండో స్థానం, 6.19Pతో కర్ణాటక మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఇదే విభాగంలో ప.బెంగాల్ చిట్టచివర నిలిచింది. జ్యుడీషియల్ ర్యాంకింగ్‌లో TGకి 2వ, APకి 5వ స్థానాలు దక్కాయి. అలాగే, ప్రిజన్స్ విభాగంలో ఏపీ 4వ, టీజీ 7వ స్థానంలో నిలిచాయి.

error: Content is protected !!