News September 2, 2025
టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ: చంద్రబాబు

AP: విశాఖ త్వరలోనే టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా మారనుందని సీఎం చంద్రబాబు అన్నారు. పెద్ద ఎత్తున డేటా సెంటర్లు వైజాగ్కు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పోర్టుకు కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఈస్ట్ కోస్ట్ మారిటైం లాజిస్టిక్స్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటుకు అనుగుణమైన పాలసీని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News September 3, 2025
YCP యూరియా ఆందోళనలు వాయిదా

AP: ఈ నెల 6న జరగాల్సిన యూరియా ఆందోళనలను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వైసీపీ తెలిపింది. కాగా రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్డీఓ ఆఫీసుల ఎదుట నిరసన చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఆ తర్వాత ఆర్డీవోలకు వినతి పత్రాలు సమర్పించాలని భావించింది. టీడీపీ నేతలు ఎరువులను బ్లాక్ చేసి పక్కదారి పట్టిస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది.
News September 3, 2025
రేపు చైనా విక్టరీ పరేడ్.. హాజరుకానున్న షరీఫ్, మునీర్

వరల్డ్ వార్-2లో గెలిచి 80 ఏళ్లవుతున్న నేపథ్యంలో చైనా రేపు విక్టరీ పరేడ్ నిర్వహించనుంది. దీనికి పాక్ PM షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ హాజరుకానుండటం గమనార్హం. రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా నియంత కిమ్ సహా ఆసియా, ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికాకు చెందిన పలు దేశాధినేతలు పాల్గొననున్నారు. ఈ పరేడ్లో సైనిక శక్తిని చాటేందుకు అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు, వార్ హెడ్లను చైనా ప్రదర్శించనుంది.
News September 2, 2025
ఆ ప్రచారంతో ఆరు నెలలు ఆఫర్లు రాలేదు: అనుపమ

‘రంగస్థలం’ సినిమా ఆఫర్ వదులుకున్నానని తనపై తప్పుడు ప్రచారం జరిగిందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. రామ్ చరణ్ సినిమాను రిజెక్ట్ చేశారనే ప్రచారంతో తాను ఆఫర్లు లేకుండా 6 నెలలు ఖాళీగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘రంగస్థలంలో నటించాలని సుకుమార్ అడిగారు. నేను అందుకు సిద్ధమయ్యాను. అదే సమయంలో వారు వేరే హీరోయిన్ను నా స్థానంలో తీసుకున్నారు’ అని చెప్పారు. ఈ మూవీలో సమంత నటించిన సంగతి తెలిసిిందే.