News July 25, 2024

బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమార్ రాజు

image

AP: బీజేపీ శాసనసభాపక్ష నేతగా MLA విష్ణుకుమార్ రాజు, పార్టీ విప్‌గా MLA ఆదినారాయణరెడ్డి ఎంపికయినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. వీరిద్దరి ఎంపికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి లేఖ పంపినట్లు తెలిపారు. అసెంబ్లీలో ప్యానల్ స్పీకర్లుగా మండలి బుద్ధ ప్రసాద్, వరదరాజుల రెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోళ్ల లలిత కుమారి, దాసరి సుధ, పి.విష్ణుకుమార్ రాజులను ఎంపిక చేసినట్లు ప్రకటించారు.

Similar News

News December 11, 2025

టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాలా? మీరేమంటారు?

image

తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా సీబీఎస్‌ఈ తరహాలో పరీక్షల మధ్య ఎక్కువ గ్యాప్ ఇచ్చామని విద్యాశాఖ చెబుతోంది. అయితే దీన్ని టీచర్ల ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇన్నిరోజుల గ్యాప్ వల్ల స్టూడెంట్స్ మరింత ఒత్తిడికి గురవుతారని, షెడ్యూల్‌లో లాజిక్ లేదని అంటోంది. విద్యార్థుల పేరెంట్స్‌గా మీ అభిప్రాయం ఏంటి?

News December 11, 2025

ఫ్లైట్ జర్నీలో సమస్యలుంటే ఇలా చేయండి

image

ఇండిగో సేవలు సాధారణస్థితికి వచ్చినా కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ‘ప్రయాణికుల కంప్లైంట్స్ రియల్ టైమ్ పరిష్కారం కోసం క్రమం తప్పకుండా నిఘా ఉంచుతున్నాం. ఏదైనా సమస్య ఉంటే Xలో @MoCA_GoIని ట్యాగ్ చేయండి. కంట్రోల్ రూమ్‌ను 011-24604283/011-24632987 నంబర్‌లలో సంప్రదించండి. AirSewa యాప్/వెబ్ పోర్టల్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు’ అని ట్వీట్ చేశారు.

News December 11, 2025

మోదీకి నెతన్యాహు ఫోన్

image

ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఫోన్ చేశారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ ఆరా తీశారు. గాజాలో శాంతి స్థాపనకు తమ సహకారం ఉంటుందని మోదీ పునరుద్ఘాటించారు.