News August 30, 2024
సెప్టెంబరు 3 నుంచి విస్తారా బుకింగ్లు బంద్

ఎయిరిండియాతో విలీనం నేపథ్యంలో నవంబర్ 11న విస్తారా చివరి విమానం నడవనుంది. SEP 3 నుంచి విస్తారాలో బుకింగ్లు నిలిచిపోనున్నాయి. ఇకపై ఎయిరిండియా సైటు నుంచే బుకింగ్స్ జరుగుతాయి. విస్తారాను AIలో విలీనం చేసే ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా సింగపూర్ ఎయిర్లైన్స్ ఎయిరిండియాలో 25.1% వాటాలు కొనుగోలు చేస్తుంది. ఈ విలీన ప్రక్రియ ఈ ఏడాది చివరికి పూర్తయ్యే అవకాశం ఉంది. 2022 నవంబర్లో ఈ విలీనాన్ని ప్రకటించారు.
Similar News
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 18, 2025
మైథాలజీ క్విజ్ – 9

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>