News August 30, 2024
సెప్టెంబరు 3 నుంచి విస్తారా బుకింగ్లు బంద్

ఎయిరిండియాతో విలీనం నేపథ్యంలో నవంబర్ 11న విస్తారా చివరి విమానం నడవనుంది. SEP 3 నుంచి విస్తారాలో బుకింగ్లు నిలిచిపోనున్నాయి. ఇకపై ఎయిరిండియా సైటు నుంచే బుకింగ్స్ జరుగుతాయి. విస్తారాను AIలో విలీనం చేసే ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా సింగపూర్ ఎయిర్లైన్స్ ఎయిరిండియాలో 25.1% వాటాలు కొనుగోలు చేస్తుంది. ఈ విలీన ప్రక్రియ ఈ ఏడాది చివరికి పూర్తయ్యే అవకాశం ఉంది. 2022 నవంబర్లో ఈ విలీనాన్ని ప్రకటించారు.
Similar News
News November 20, 2025
డాక్టర్ నిర్వాకం.. బాలుడికి ఫెవీక్విక్తో వైద్యం!

మీరట్(UP)లో జస్పిందర్ సింగ్ అనే వ్యక్తి కుమారుడు ఆడుతూ టేబుల్కు గుద్దుకున్నాడు. నుదుటిపై గాయం కావడంతో భాగ్యశ్రీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు రక్తం ఆపేందుకు గాయానికి ఫెవీక్విక్ వేసి వైద్యం చేశారని దంపతులు ఆరోపిస్తున్నారు. పిల్లాడి ఇబ్బంది చూసి మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా వాళ్లు 3 గంటలు కష్టపడి గాయాన్ని శుభ్రంచేసి 4 కుట్లు వేశారన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 20, 2025
పాము పొడ తెగులు నివారణ ఎలా?

మొక్కజొన్నలో పాముపొడ తెగులు నివారణకు నేలకు దగ్గరగా ఉన్న తెగులు సోకిన ఆకులను తొలగించి నాశనం చేయాలి. తర్వాత 200 గ్రా. కార్బెండజిమ్ (లేదా) 200 మి.లీ. ప్రోపికొనజోల్ మందును 200 లీటర్ల నీటికి కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఏటా ఈ తెగులు ఆశించే ప్రాంతాల్లో పంట విత్తిన 40 రోజుల తర్వాత తెగులు సోకకముందే ఈ మందులను పిచికారీ చేసుకోవాలని.. పంట చుట్టూ కలుపు మొక్కలను తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News November 20, 2025
హిమాలయాలకే వెళ్తాం.. చాలామంది ట్రావెల్ డెస్టినేషన్ ఇదేనట!

‘అమెరికన్ ఎక్స్ప్రెస్ ట్రావెల్’ విడుదల చేసిన అత్యంత ప్రతిష్ఠాత్మక ‘ట్రెండింగ్ డెస్టినేషన్స్ 2026’ జాబితాలో హిమాలయాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఆధ్యాత్మికత, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కలగలిసిన ఈ పర్వత శ్రేణులు వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువమంది యాత్రికులను ఆకర్షించనున్నాయని సంస్థ పేర్కొంది. ఇది భారత హిమశిఖరాలకు దక్కిన గొప్ప అంతర్జాతీయ గౌరవమని నెటిజన్లు కొనియాడుతున్నారు.


