News August 21, 2024
వివేకా హత్య కేసు: ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్

వైఎస్ వివేకానంద హత్య కేసులో నిందితుడిగా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతడు సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని, బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరింది. అయినా న్యాయస్థానం తాజాగా బెయిల్ ఇచ్చింది. కాగా, ఇదే కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది.
Similar News
News December 12, 2025
కాలుష్య సమస్యపై చర్చ కోరిన రాహుల్.. అంగీకరించిన కేంద్రం

దేశంలో గాలి కాలుష్యం పెరిగిపోతోందని, పరిష్కార మార్గాలపై చర్చించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. ‘పిల్లలకు లంగ్స్ సమస్యలు వస్తున్నాయి. గాలి పీల్చుకోవడానికి వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు’ అని చెప్పారు. గాలి కాలుష్య సమస్యపై చర్చకు ప్రభుత్వం రెడీగా ఉందని లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ దానికి సమయం ఇస్తుందని పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరన్ రిజిజు తెలిపారు.
News December 12, 2025
విశాఖ నుంచి సేవలు అందించనున్న IT సంస్థలు

AP: CM CBN కాగ్నిజెంట్ సహా 8 IT సంస్థల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ నిర్మాణం 3 దశల్లో పూర్తి కానుంది. కాగా ఈ సంస్థలన్నీ విశాఖ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. వీటి ద్వారా రాష్ట్రానికి ₹3,740 కోట్ల పెట్టుబడులు, దాదాపు 41,700 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇప్పటికే VSP నుంచి 150కి పైగా కంపెనీలు సేవలందిస్తున్నాయని, ఐటీ నిపుణులకు అవకాశాలు పెరిగాయని ప్రభుత్వం పేర్కొంది.
News December 12, 2025
వైట్ డిశ్చార్జ్కి ఇలా చెక్ పెట్టండి

చాలామంది మహిళలకు వివిధ కారణాల వల్ల వైట్ డిశ్చార్జ్ జరుగుతుంది. దీనికి బియ్యం కడిగిన నీరు పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. ఈ నీటిని తాగడం వల్ల వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గడంతో పాటు చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. అలాగే మూత్ర విసర్జన సమయంలో మంట, విరేచనాలు, రక్తస్రావానికి సంబంధించిన రుగ్మతలు, పీరియడ్స్లో అధిక రక్తస్రావం వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.


