News April 15, 2025
వివేకా హత్య కేసు.. నిందితుడు ఉదయ్కి సుప్రీం నోటీసులు

AP: వివేకా హత్య కేసు నిందితుడు ఉదయ్ కుమార్ బెయిల్ రద్దు చేయాలంటూ YS సునీత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసులో ఉదయ్ పాత్ర ఏమిటని CJI ధర్మాసనం ప్రశ్నించింది. హత్య జరిగాక గాయాలు కనపడకుండా కట్లు కట్టి తప్పుడు ప్రచారం చేసిన వారిలో ఇతనూ ఉన్నాడని సునీత తరఫు లాయర్లు వెల్లడించారు. దీంతో ఉదయ్కి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
Similar News
News April 17, 2025
పురుషులకు అలర్ట్.. ఈ తప్పు చేయకండి

ఆరోగ్యకర ఆహారం తీసుకుంటున్నా, మద్యం, సిగరెట్ అలవాట్లు మానేసినా లైంగిక సామర్థ్యం మెరుగుపడటం లేదని చాలామంది పురుషులు బాధపడుతుంటారు. అయితే విటమిన్-D లోపమూ ఇందుకు కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇది బోన్స్, రోగ నిరోధక శక్తితో పాటు లైంగిక సామర్థ్యంపైనా ప్రభావం చూపుతుందని పేర్కొంది. విటమిన్-డి లెవెల్స్ తగ్గకుండా మెయింటేన్ చేయాలని సూచించింది. పూర్తి వివరాలు ఈ లింక్పై <
News April 17, 2025
ముర్షిదాబాద్ అల్లర్లపై సిట్ ఏర్పాటు

పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్లో ఇటీవల జరిగిన అల్లర్లపై రాష్ట్ర పోలీసులు 9మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత వారం అక్కడ జరిగిన ఆందోళనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో హింసకు కారకులు, తదితరాలపై ప్రభుత్వానికి సిట్ నివేదిక అందించనుంది. మరోవైపు అల్లర్లలో మృతి చెందిన ముగ్గురి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున CM మమత నష్టపరిహారం ప్రకటించారు.
News April 17, 2025
రోహిత్, కోహ్లీ, బుమ్రాకు A+ కాంట్రాక్ట్?

రోహిత్, కోహ్లీ, బుమ్రాకు BCCI A+ కాంట్రాక్ట్ కేటాయించనున్నట్లు సమాచారం. బోర్డు వర్గాల్ని ఉటంకిస్తూ స్పోర్ట్స్తక్ ఈ విషయాన్ని తెలిపింది. మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్న అగ్ర క్రికెటర్లకు మాత్రమే బోర్డు A+ గ్రేడ్ కేటాయిస్తోంది. రోహిత్, కోహ్లీ ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికారు. వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి A+ గ్రేడ్ దక్కుతుందా లేదా అన్న ఆసక్తి క్రికెట్ వర్గాల్లో నెలకొంది.