News March 15, 2025

గవర్నర్‌ను కలిసిన వివేకా కుమార్తె సునీత

image

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీత రాజ్ భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. తన తండ్రి హత్య కేసు విచారణ వేగవంతం చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా హత్య కేసులో కీలక పరిణామాలను ఆయనకు వివరించారు. వివేకా హత్య జరిగి 6 ఏళ్లు అయిందని, న్యాయం కోసం అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నానని ఆమె ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కలిశారు.

Similar News

News April 1, 2026

మహిళల దృష్టిలో.. ‘ఆడు మగాడ్రా బుజ్జి’

image

దంపతుల మధ్య లైంగిక స్పందనలు వేర్వేరుగా ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. పురుషుడు త్వరగా ఉద్రేకం పొందితే.. స్త్రీ సిద్ధమవడానికి సమయం, స్పర్శ, సురక్షిత భావన అవసరమంటున్నారు. ‘బలవంతంతో కూడిన సెక్స్‌లో ప్రేమ ఉండదు. అది విడాకులకు దారి తీయొచ్చు. పోర్నోగ్రఫీకి దూరంగా ఉండి భాగస్వామి ఇష్టాలను గౌరవిస్తూ ఇద్దరూ ఆనందించడమే వివాహ బంధానికి పరమార్థం. స్త్రీ మనసు గెలవడమే అసలైన మగతనం’అని పేర్కొంటున్నారు.

News April 1, 2026

త్వరలో ఆ రైతుల అకౌంట్లలోకి డబ్బులు!

image

TG: రాష్ట్రంలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులకు త్వరలో రైతు‌భరోసా సాయం అందనుంది. ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తి కాగా, పరిశీలన జరుగుతున్నట్లు సమాచారం. కొత్తగా 62 వేల మంది అప్లై చేసుకోగా, అర్హులుగా గుర్తించిన రైతులకు ఈ నెల 15-20వ తేదీల మధ్య నిధులు జమ చేస్తారని తెలుస్తోంది. గత నెల 23వ తేదీ ఎకరాకు రూ.6వేలు చొప్పున తొలి విడత సాయం రైతుల అకౌంట్లలో జమ చేశారు.

News April 1, 2026

విమాన ఇంధన ధరకు రెక్కలు.. పెరగనున్న టికెట్ రేట్లు

image

విమానం ఇంధనం ధరలు ఆకాశాన్నంటాయి. కిలో లీటర్(1000 లీటర్లు) ఫ్లైట్ ఆయిల్ ధర రికార్డ్ స్థాయిలో రూ.2,07,341కి చేరింది. గతంలో కిలో లీటర్‌కు రూ.96,638 ఉండగా ఏకంగా రెట్టింపు ధర పెరగడం గమనార్హం. జెట్ ఫ్యూయల్ ధర రూ.2 లక్షల మార్కు దాటడం ఇదే తొలిసారి. ఇక మొత్తంగా గత నెలతో పోలిస్తే ఇంటర్నేషనల్ విమానాల ఫ్యూయల్ ధర 115%, డెమిస్టిక్‌లో 107% పెరిగింది. దీంతో విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగే అవకాశముంది.