News March 15, 2025

గవర్నర్‌ను కలిసిన వివేకా కుమార్తె సునీత

image

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీత రాజ్ భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. తన తండ్రి హత్య కేసు విచారణ వేగవంతం చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా హత్య కేసులో కీలక పరిణామాలను ఆయనకు వివరించారు. వివేకా హత్య జరిగి 6 ఏళ్లు అయిందని, న్యాయం కోసం అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నానని ఆమె ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కలిశారు.

Similar News

News March 16, 2025

మానసికంగా ధైర్యం కోల్పోయా: మంత్రి సీతక్క

image

TG:సోషల్ మీడియాలో తనపై పెట్టిన పోస్టులకు మానసికంగా ధైర్యం, కోల్పోయానని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీగా పనిచేసే మహిళల ధైర్యాన్ని సోషల్ మీడియా, పోస్టులు దెబ్బ తీస్తాయన్నారు. బీఆర్ఎస్ రాజకీయంగా ఎదుర్కొవాలి గానీ, సామాజిక మాధ్యమాలతో తప్పుడు ప్రచారం చేయడమేంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ చేసిన మార్చురీ వ్యాఖ్యలు వ్యక్తిని కాదు పార్టీని ఉద్దేశించనవని మంత్రి స్పష్టం చేశారు.

News March 16, 2025

ఫెడరల్ వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది: స్టాలిన్

image

రాజ్యాంగానికి మూలమైన ఫెడరల్ వ్యవస్థ ప్రస్తుతం ప్రమాదంలో పడుతుందని CMస్టాలిన్ ఆరోపించారు. విద్య, నిధుల అంశాల్లో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని అన్నారు. మద్రాస్ బార్ అసోసియేషన్ 160 సంవత్సరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక న్యాయవాది తమిళంలో ప్రసంగిస్తారు అనుకుంటే ఇంగ్లీష్‌లో మాట్లాడారు. మరొకరేమో ఆంగ్లంలో అనుకుంటే తమిళంలో ప్రసంగించారు. ఇది తమిళనాడు ఇక్కడ రెండు భాషలే ఉంటాయని తేల్చిచెప్పారు.

News March 16, 2025

అమెరికాలో తుపాను ధాటికి 16మంది మృతి

image

అమెరికాలో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీని వల్ల ఇప్పటివరకూ 16మంది మృతి చెందారు. మిస్సోరీ రాష్ట్రంలో 10మంది, అర్కన్నాస్‌లో ముగ్గురు మరణించగా వివిధ ప్రాంతాలలో పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. బలమైన గాలుల ధాటికి భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలలో కార్చిచ్చులు చెలరేగడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో రాష్ట్రాలకు వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీచేసింది.

error: Content is protected !!