News March 16, 2024
విజయనగరం: ‘విద్యుత్ చౌర్యం చేస్తే సమాచారం అందించండి’

విద్యుత్ నిఘా శాఖ, DPE అధికారులు విజయనగరం సర్కిల్ పరిదిలో పలు ప్రాంతాల్లో సంయుక్తంగా దాడులు చేసినట్లు విద్యుత్ విజిలెన్స్ విజయనగరం సర్కిల్ సీఐ కె. కృష్ణ శనివారం తెలిపారు. తెర్లాం మండలం బూరిపేట, మెరకముడిదాం మండలం బుదరాయవలస గ్రామాలలో విద్యుత్ చౌర్యం చేస్తున్న నిందితుల నుంచి 1,03,548 అపరాద రుసుం, రూ.10వేలు జరిమానా విధించామన్నారు. విద్యుత్ చౌర్యం సమాచారం తెలిస్తే 08922-234579కి తెలియజేయాలన్నారు.
Similar News
News November 12, 2025
ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి తప్పనిసరి: DSP

శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్ 30 పోలీసు చట్టంను నవంబర్ 12 నుంచి డిసెంబర్ 11వరకు అమలు చేస్తున్నట్లు విజయనగరం ఇన్ఛార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు మంగళవారం తెలిపారు. ముందస్తు అనుమతులు లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించి, పోలీసుశాఖ అనుమతులతోనే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
News November 12, 2025
రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం: మంత్రి

విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే CII 30వ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి మేలు చేయనుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, 30 మంది విదేశీ మంత్రులు పాల్గొననున్నారని చెప్పారు. మొత్తం 410 ఒప్పందాల ద్వారా రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు.
News November 11, 2025
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 7రోజుల జైలు శిక్ష: SP

జామి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించి స్కూటీ నడిపిన కొట్టాం గ్రామానికి చెందిన నక్కెళ్ల ఎర్రినాయుడుకు కోర్టు 7రోజులు జైలు శిక్ష విధించిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈనెల 9న విసినిగిరి జంక్షన్ వద్ద వాహన తనిఖీల సమయంలో మద్యం తాగి స్కూటీ నడిపిన నిందితుడిని జామి పోలీసులు పట్టుకున్నారు. సాక్ష్యాధారాలతో కోర్టులో హాజరుపరిచిన తరువాత శిక్ష ఖరారైందన్నారు.


