News November 2, 2024
విజయనగరం ‘స్థానిక’ ఎమ్మెల్సీ స్థానానికి 4న నోటిఫికేషన్

AP: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా MLC నియోజకవర్గ ఉప ఎన్నికకు ఈ నెల 4న EC నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 11 వరకు నామినేషన్లు స్వీకరణ, 12న పరిశీలన ఉంటుంది. నవంబర్ 28న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 1న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇందుకూరి రఘురాజు టీడీపీలో చేరడంతో మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో బై ఎలక్షన్ అనివార్యమైంది.
Similar News
News November 13, 2025
ఎప్స్టీన్ ఇంట్లో ట్రంప్ గంటలు గడిపాడు: డెమోక్రాట్లు

లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ ఇంట్లో డొనాల్డ్ ట్రంప్ గంటలకొద్ది సమయం వెచ్చించాడని డెమోక్రాట్లు ఈమెయిల్స్ను రిలీజ్ చేశారు. ఆయనకు బాలికల లైంగిక వేధింపుల గురించి ముందే తెలుసని ఆరోపించారు. అయితే ఇది డెమోక్రాట్లు పన్నిన ఉచ్చు అని ట్రంప్ ఖండించారు. వారి మోసాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు డెమోక్రాట్లు ఏమైనా చేస్తారని ఫైరయ్యారు.
News November 13, 2025
ఢిల్లీ ఘటన ‘గ్యాస్ సిలిండర్ పేలుడు’: పాక్ మంత్రి

ఢిల్లీ <<18270750>>పేలుడు<<>>పై పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ కుటిల వ్యాఖ్యలు చేశారు. ‘నిన్నటి వరకు అది గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇప్పుడు విదేశీ కుట్ర దాగి ఉందని భారత్ చెబుతోంది’ అని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఘటనను భారత్ వాడుకుంటుందని ఓ టీవీ షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తమపై ఆరోపణలు చేసినా ఆశ్చర్యపోనని అన్నారు. తమ వరకు వస్తే ఊరికే ఉండబోమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.
News November 13, 2025
విశాఖ సదస్సుతో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎంవో

AP: విశాఖలో జరగనున్న CII భాగస్వామ్య సదస్సుకు రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోందని CMO తెలిపింది. ఈ సమావేశంలో ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయని వెల్లడించింది. ‘ఇన్వెస్ట్ ఇన్ ఏపీ’ సందేశాన్ని సమ్మిట్ ద్వారా చాటి చెప్పాలని సీఎం చంద్రబాబు సంకల్పించినట్లు పేర్కొంది. కాగా ఈ సదస్సులో సీఎం వైజాగ్కు చేరుకోగా ఆయనకు హోంమంత్రి అనిత, పలువురు మంత్రులు స్వాగతం పలికారు.


