News March 25, 2024
విజయనగరం ఎంపీ సీటు TDPకే..
AP: విజయనగరం లోక్సభ స్థానం నుంచి టీడీపీయే బరిలోకి దిగనుంది. తొలుత పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు. అయితే తాజాగా కమలం పార్టీ విజయనగరానికి బదులు రాజంపేట ఎంపీ స్థానాన్ని తీసుకుంది. అక్కడి నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఇక విజయనగరం నుంచి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావు బరిలోకి దిగే అవకాశముంది.
Similar News
News October 3, 2024
GST: కొన్నిటిపై పెంపు.. మరికొన్నిటిపై తగ్గింపు!
మెడిసిన్స్, ట్రాక్టర్స్ సహా ఎక్కువ ఉపయోగించే ఐటమ్స్పై GST రేటును 5 శాతానికి తగ్గించాలని మంత్రుల ప్యానెల్ యోచిస్తోందని తెలిసింది. సిమెంటు, టొబాకో వంటి వాటిపై 28% కొనసాగొచ్చు. ప్రస్తుతం కొన్ని ట్రాక్టర్లపై 12 లేదా 28% వరకు ట్యాక్స్ ఉంది. హై ఎండ్ EVs, రూ.40 లక్షల కన్నా విలువైనవి, ఇంపోర్ట్ వెహికల్స్పై 5% నుంచి పెంచొచ్చు. కేరళ సహా సౌత్ స్టేట్స్ ఇష్టపడకపోవడంతో శ్లాబుల్ని తగ్గించే పరిస్థితి లేదు.
News October 3, 2024
విరాట్ ఓ గొప్ప ఆటగాడు: హర్భజన్
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ దాదా ప్లేయర్ అని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసించారు. ‘విరాట్ ఓ గొప్ప ఆటగాడు. మెగా టోర్నీలు, ఫైనల్స్లో ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు. గత టీ20 వరల్డ్ కప్లో కూడా మంచి ప్రదర్శనే చేశారు. టీ20 ఫార్మాట్లో ఆయనకు పరుగులు ఎలా రాబట్టాలో బాగా తెలుసు’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
News October 3, 2024
వ్యక్తిగత విషయాలను ఆయుధంగా మార్చడం దురదృష్టకరం: వెంకటేశ్
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు విని ఎంతో బాధేసిందని హీరో విక్టరీ వెంకటేశ్ ట్వీట్ చేశారు. ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరం. ఇలా చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కానీ, ఆ వ్యక్తులకు మరింత బాధనిస్తుంది. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని కోరుతున్నా. సినీ పరిశ్రమ ఇలాంటివి సహించదు’ అని పేర్కొన్నారు.