News March 17, 2024
విజయనగరం: సిట్టింగులకే ఛాన్స్

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలనే వైసీపీ మళ్లీ అభ్యర్థులుగా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో గెలిచిన 9 మందిలో బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, పీడిక రాజన్నదొరకి జగన్ కేబినెట్లో చోటు ఇచ్చారు. కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇచ్చారు. శంబంగి చినఅప్పలనాయుడు ప్రొటెం స్పీకర్గా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో వీరి గెలుపుపై మీ కామెంట్
Similar News
News November 18, 2025
మెరకముడిదాం : ఉపాధ్యాయుడుని సత్కరించిన విజయనగరం ఎంపి

మెరకముడిదాం మండలం గోపన్నవలస ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు మరడాన సత్యారావుని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం సత్కరించారు. 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను పదవతరగతి విద్యార్థులను విమానం ఎక్కించినందుకు సత్యారావుని ఎంపి అభినందించారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న విద్యార్థులను విమానం ఎక్కిస్తానని సత్యారావు తెలిపారు.
News November 18, 2025
‘మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలను అందించండి’: SP

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్సైట్కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోంలకు తరలించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు.
News November 18, 2025
‘మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలను అందించండి’: SP

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్సైట్కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోంలకు తరలించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు.


