News March 17, 2024
విజయనగరం: సిట్టింగులకే ఛాన్స్

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలనే వైసీపీ మళ్లీ అభ్యర్థులుగా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో గెలిచిన 9 మందిలో బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, పీడిక రాజన్నదొరకి జగన్ కేబినెట్లో చోటు ఇచ్చారు. కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇచ్చారు. శంబంగి చినఅప్పలనాయుడు ప్రొటెం స్పీకర్గా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో వీరి గెలుపుపై మీ కామెంట్
Similar News
News January 3, 2026
బొండపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

బొండపల్లి మండలం, మరువాడ గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం పాల్గొన్నారు. రైతుల భూ హక్కులు స్పష్టంగా నమోదై, భవిష్యత్లో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఉండేలా ఈ విధానం రూపకల్పన చేశామన్నారు. క్యూ ఆర్ కోడ్ కలిగిన ఆధునిక పాస్ పుస్తకాలు ప్రభుత్వ రాజముద్రతో అందిస్తున్నామని చెప్పారు.కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు.
News January 3, 2026
VZM: కేజీబీవీ నోటిఫికేషన్.. జిల్లాలో ఖాళీల వివరాలు

AP KGBV ఔట్సోర్సింగ్లో 1095 పోస్టులకు <
News January 3, 2026
బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష: VZM SP

బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి కోర్టు కఠిన కారాగార శిక్షను విధించినట్లు SP దామోదర్ శుక్రవారం తెలిపారు. బాడంగి (M)కి చెందిన V.వెంకటరమణ అదే ప్రాంతానికి చెందిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో 2024 డిసెంబర్లో పోక్సో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.


