News March 17, 2024

విజయనగరం: సిట్టింగులకే ఛాన్స్

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలనే వైసీపీ మళ్లీ అభ్యర్థులుగా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో గెలిచిన 9 మందిలో బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, పీడిక రాజన్నదొరకి జగన్ కేబినెట్‌లో చోటు ఇచ్చారు. కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం ఇచ్చారు. శంబంగి చినఅప్పలనాయుడు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో వీరి గెలుపుపై మీ కామెంట్

Similar News

News November 6, 2025

మెంటాడ మార్పుపై ఎటువంటి ప్రతిపాదన చేయలేదు: మంత్రి

image

మెంటాడ మండలాన్ని మన్యం జిల్లాలో చేర్చాలనే అంశంపై తాను ఎటువంటి ప్రతిపాదన చేయలేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. జడ్పీ సమావేశంలో జడ్పీటీసీ సన్యాసినాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి ఆందోళనలో చేపడుతున్నారన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఇతర జిల్లాల నుంచి మాత్రమే ప్రతిపాదనలు వచ్చినట్లు పేర్కొన్నారు. అనవసర ఆందోళనలు వద్దని సూచించారు.

News November 6, 2025

VZM: ‘రియల్ టైం గవర్నెన్స్‌తో ప్రజలకు చేరువుగా సేవలు’

image

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రియల్ టైమ్ గవర్నెన్స్‌ ద్వారా ప్రజలకు సేవలు మరింత చేరువవుతున్నాయని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. ఉన్నత స్థాయి అధికారులతో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ఎస్పీ పాల్గొన్నారు. నేర నియంత్రణలో టెక్నాలజీ వినియోగంపై సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు అందజేశారన్నారు. ఈ మేరకు అమలు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

News November 6, 2025

రాజాం: పాము కాటుకు గురైన రైతులు

image

రాజాం మండలంలో పొలం పనులు కొనసాగుతుండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా విషకీటకాల బారినపడుతున్నారు. పాము కాటు బాధితుల్లో 90% మంది వీరే ఉంటున్నారు. మండలంలో అమరం గ్రామానికి చెందిన శంకర్రావు, సంకిలి గ్రామానికి చెందిన శివ, కింజంగి గ్రామానికి చెందిన శ్రీరాము, పెంట గ్రామానికి చెందిన ఆదినారాయణ వరికోతలు చేస్తుండగా బుధవారం పాము కాటుకు గురయ్యారు. వీరు రాజాం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.