News March 12, 2025
VJA: అలర్ట్.. అనంతపురం వరకే నడవనున్న ఆ రైళ్లు

విజయవాడ మీదుగా ప్రయాణించే మచిలీపట్నం(MTM)-ధర్మవరం(DMM) రైళ్లు కొద్ది రోజుల పాటు అనంతపురం వరకే నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ధర్మవరం స్టేషనులో 5వ నం. ఫ్లాట్ఫామ్పై పనులు జరుగుతున్నందున, ఈనెల 12 నుంచి 30 వరకు నం.17215 MTM-DMM రైలు, అదే విధంగా ఈ నెల 13 నుంచి 31 వరకు నం.17216 DMM- MTM రైలు అనంతపురం వరకే నడుస్తాయన్నారు.
Similar News
News November 25, 2025
ICAR-IIMRలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

HYDలోని ICAR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్లో 5 సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc(జెనిటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, లైఫ్ సైన్స్, ప్లాంట్ మాలిక్యులార్ బయాలజీ ), PhD, PG( అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్) ఉత్తీర్ణతతో పాటు NET అర్హత సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://www.millets.res.in/
News November 25, 2025
WGL: నిన్నటి లాగే స్థిరంగా పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర స్థిరంగా ఉంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా మంగళవారం సైతం అదే ధర పలికింది. రెండు వారాల క్రితం రూ.7 వేలు మార్కు దాటిన పత్తి ధర క్రమంగా తగ్గుతుండడంతో అన్నదాతలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.
News November 25, 2025
JGTL: మై భారత్ యూత్ వాలంటీర్ల ఎంపికకు ధోనికెల నవీన్

NYC పథకం కింద మై భారత్ యూత్ వాలంటీర్ల ఎంపిక కోసం జగిత్యాల జిల్లా స్థాయి కమిటీ సభ్యుడిగా మెట్పల్లి పట్టణానికి చెందిన ధోనికెల నవీన్ను మంగళవారం భారత ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మై భారత్ ఉప సంచాలకులు దేవేంద్ర వీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మై భారత్ కార్యక్రమాలు, NYC వాలంటీర్ల బాధ్యతల నిర్వహణలో నవీన్ మార్గదర్శకత్వంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కేంద్రం సూచించింది.


