News March 12, 2025

VJA: అలర్ట్.. అనంతపురం వరకే నడవనున్న ఆ రైళ్లు

image

విజయవాడ మీదుగా ప్రయాణించే మచిలీపట్నం(MTM)-ధర్మవరం(DMM) రైళ్లు కొద్ది రోజుల పాటు అనంతపురం వరకే నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ధర్మవరం స్టేషనులో 5వ నం. ఫ్లాట్‌ఫామ్‌పై పనులు జరుగుతున్నందున, ఈనెల 12 నుంచి 30 వరకు నం.17215 MTM-DMM రైలు, అదే విధంగా ఈ నెల 13 నుంచి 31 వరకు నం.17216 DMM- MTM రైలు అనంతపురం వరకే నడుస్తాయన్నారు. 

Similar News

News October 29, 2025

వికారాబాద్: పాపం తడుస్తూ ఇంటికి వెళ్లారు..!

image

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు వర్షంలో తడిసి ముద్దయ్యారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకున్న తర్వాత క్లాస్‌రూమ్‌ల్లోకి వెళ్లి పరీక్షలు రాస్తుండగా, మధ్యంతరంగా విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు.విద్యార్థులు వర్షంలో ఇంటికి తిరిగి ఎలా వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయాన్నే సెలువుపై అధికారులు నిర్ణయం తీసుంటే బాగుండేదని తల్లిదండ్రులు అంటున్నారు.

News October 29, 2025

పుట్టపర్తిలో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

image

అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. కొత్తచెరువు పూజారి వీధిలో దొంగలు ఉన్నారనే సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10.5 తులాల బంగారం, 1250 గ్రాముల వెండి, 4 ఫోన్లు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వడిషన వేణుగోపాల్ రెడ్డి, చిన్నం ఆదెమ్మలపై రాష్ట్రంలోని పలుచోట్ల చోరీ కేసులు నమోదయ్యాయని డీఎస్పీ వివరించారు.

News October 29, 2025

గాజాపై దాడులు.. 60 మంది మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ దాడిలో 60 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నారని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశించడంతో సైన్యం 3చోట్ల బాంబుల వర్షం కురిపించింది. కాగా బందీల మృతదేహాల అప్పగింతకు ఉద్రిక్త పరిస్థితులు అడ్డంకిగా ఉన్నట్లు హమాస్ పేర్కొంది. హమాస్ ఇజ్రాయెల్ సైనికుడిని చంపడం వల్లే దాడి జరిగిందని, ఇది శాంతికి విఘాతం కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు.