News February 17, 2025
VJA: ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు మృతి

విజయవాడలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనలు చేటు చేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుడమేరు ఏరియాలో ఉండే మణికంఠ (32) ఈ నెల 6న తన భార్య, పిల్లలు బయటకు వెళ్లి తిరిగి రాలేదని మనస్తాపంతో గడ్డిమందు తాగాడు. శనివారం చికిత్సపొందుతూ మృతి చెందాడు. మరోవైపు అప్పుల బాధ తాళలేక కట్టా వీర్రాజు అనే వ్యక్తి విషం తాగాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సండే మృతి చెందాడు. ఈ ఘటనలపై కేసు నమోదు చేశారు.
Similar News
News December 22, 2025
ప్రజా దివాస్ దరఖాస్తులపై తక్షణ చర్యలు చేపట్టాలి: ఎస్పీ

ప్రజా దివాస్ దరఖాస్తులపై తక్షణ చర్యలు చేపట్టాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. ప్రజా దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ సోమవారం భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తం 10 దరఖాస్తులను ఎస్పీ శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు.
News December 22, 2025
పెట్టుబడులు రావడం KCRకు ఇష్టం లేదేమో: మంత్రి శ్రీధర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని KCR ఎందుకు చూడలేకపోతున్నారో అర్థం కావడం లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాలపై KCR కామెంట్లను ఆయన ఖండించారు. ‘పెట్టుబడులు, ఉద్యోగాలు రావడం KCRకు ఇష్టం లేనట్టుంది. BRS హయాంలో జరిగిన చాలా ఒప్పందాలు కార్యరూపం దాల్చలేదు. అభివృద్ధికి దోహదపడేలా KCR సలహాలివ్వాలి. BRS నేతలు హైప్లో ఉన్నారు. మేం ప్రజలకు హోప్ ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News December 22, 2025
నెల్లూరు: కరెంటోళ్ల జనబాట పోస్టర్లు, యాప్ ఆవిష్కరణ

APSPDCLఆధ్వర్యంలో రూపొందించిన కరెంటోళ్ల జనబాట పోస్టర్లు, యాప్ను కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ఆవిష్కరించారు. వినియోగదారుల సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రతి మంగళవారం, శుక్రవారం జనబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నేరుగా గ్రామాలు, పట్టణ వార్డుల్లో పర్యటించి వినియోగదారులతో మమేకం కానున్నారు.


