News March 4, 2025

VJA: ఎమ్మెల్యే సుజనాకు స్పీకర్ కితాబు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మంగళవారం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ వెస్ట్ MLA సుజనా చౌదరి బడ్జెట్‌పై కూలంకషంగా మాట్లాడారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. చాలా బాగా మాట్లాడారని కితాబిచ్చారు. దీంతో సుజనా మాట్లాడుతూ.. సభకు అటెండెన్స్ మరింత పెరిగితే బాగుంటుందని అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.

Similar News

News October 17, 2025

సింగరేణి కార్మికులకు నేడు రూ.1.03 లక్ష బోనస్‌

image

కొత్తగూడెం: సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు శుక్రవారం దీపావళి సందర్భంగా పర్ఫామెన్స్‌ లింక్డ్‌ రివార్డు బోనస్‌ అందనుంది. యాజమాన్యం ఈసారి ఒక్కొక్క కార్మికుడికి రూ.1.03 లక్ష చెల్లించాలని నిర్ణయించింది. గత సంవత్సరం రూ.93,750 చెల్లించగా, ఈసారి రూ.9,250 పెంచి ఇస్తోంది. ఈ నగదు నేడు(శుక్రవారం) కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ప్రతి సంవత్సరం దీపావళికి ముందు సంస్థ ఈ బోనస్‌ను అందిస్తుంది.

News October 17, 2025

పిల్లలు చదవట్లేదా?

image

సాధారణంగా చాలామంది పిల్లలు చదువంటే ఆసక్తి చూపరు. ఆటలమీదే మనసు ఉంటుంది. కొన్నిసార్లు ఇది మానసిక సమస్యకు సంకేతం అంటున్నారు నిపుణులు. బార్డర్‌లైన్‌ ఇంటిలిజెన్స్‌, స్పెసిఫిక్‌ లర్నింగ్‌ డిజెబిలిటి, ADHD వంటి సమస్యలుంటే పాఠాలు అర్థంకాకపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలుంటాయి. వీటిని గుర్తిస్తే చైల్డ్‌ సైకియాట్రిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లండి. చదువంటే భయం తగ్గి ఆసక్తి కలిగే పద్ధతులు నేర్పిస్తారు.

News October 17, 2025

యాదాద్రి: నూతన భవనం పైనుంచి పడి దుర్మరణం

image

కొత్తగా నిర్మిస్తున్న ఇంటి స్లాబ్‌కు నీరు పడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన భూదాన్ పోచంపల్లి(M) పెద్దగూడెంలో జరిగింది. గ్రామానికి చెందిన పారిపల్లి కృష్ణారెడ్డి(53) తన ఇంటి నిర్మాణంలో భాగంగా స్లాబ్‌కు నీరు పోస్తుండగా కాలుజారి కింద పడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందారు. భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ భాస్కర్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.