News April 6, 2025

VJA: గంజాయిపై ఉక్కు పాదం.. ఇద్దరి అరెస్ట్

image

గంజాయిపై విజయవాడ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో గంజాయిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ మేరకు చెన్నై వైపు గంజాయి తరలిస్తున్న కారును పటమట పోలీసులు సీజ్ చేశారు. ఈ కారులో నుంచి 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని, చిత్తూరుకు చెందిన షేక్ సాజిద్, షేక్ ఫయాజులను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించామన్నారు.

Similar News

News April 17, 2025

కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి. గోపి బాధ్యతలు 

image

కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి. గోపి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న అరుణ సారెక చిత్తూరుకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో విశాఖపట్నం వ్యాట్ కోర్టు అప్పలెట్ జడ్జిగా ఉన్న గోపి నియమితులయ్యారు. నేడు ఆయన జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. 

News April 17, 2025

నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న మంత్రి మనోహర్

image

మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం పునాదిపాడులో పర్యటించనున్నారు. అనంతరం పెనమలూరు మండలం వణుకూరులోని దాన్యం సేకరణ కేంద్రాలను పరిశీలిస్తారు. ఈ పర్యటనలో మంత్రి వెంట సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, సంభందిత ఆధికారులు పాల్గొంటారు.

News April 17, 2025

నీటి తీరువా పన్నును వసూలు చేయాలి: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో నీటి తీరువా పన్నును అత్యధిక ప్రాధాన్యతతో వసూలు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలక్టరేట్‌లోని క్యాంపు కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి రెవెన్యూ అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో రూ.32కోట్ల నీటి తీరువా పన్ను వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.9కోట్లు వసూలు చేశారన్నారు.

error: Content is protected !!