News March 17, 2025

VJA: పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీలు

image

10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీశ విజయవాడలోని గవర్నర్‌పేట సీవీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో తాగునీరు, విద్యుత్తు సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News November 21, 2025

పిల్లల వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవుతున్నారా?

image

వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల పిల్లలకు వ్యాధుల నుంచి రక్షణే కాక Herd Immunityని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బిడ్డ పుట్టినప్పటి నుంచి ఏఏ టీకాలు ఎప్పుడెప్పుడు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. దీనివల్ల ప్రాణాంతక వ్యాధుల నివారణకు రోగ నిరోధక శక్తి పెంపు ,ఆసుపత్రి ఖర్చుల తగ్గింపు, ఆరోగ్యకరమైన భవిష్యత్తు లభిస్తాయి. కాబట్టి పిల్లల టీకాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.

News November 21, 2025

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: NZB కలెక్టర్

image

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చా తప్పక పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని NZB కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి నోడల్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికలను సాఫీగా నిర్వహించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.

News November 21, 2025

బాపుఘాట్లో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం

image

HYDలో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటుకు చర్యలు ప్రారంభం అయ్యాయి. ఈసా, మూసీ నదుల సంగమం బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్‌లో గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం పట్నాలోని గాంధీ మైదానంలో 72 అడుగుల కాంస్య విగ్రహం దేశంలోనే ఎత్తైంది. దీనికంటే ఎత్తైన విగ్రహం ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.