News November 17, 2024
VJA: పోలవరం ప్రాజెక్టుపై సీపీఐ నేత రామకృష్ణ కీలక వ్యాఖ్యలు

సీపీఐ నేత రామకృష్ణ పోలవరం ప్రాజెక్టుపై ఆదివారం విజయవాడలో కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం తగ్గించి కేంద్రం రూ.25 వేల కోట్లు ఆదా చేసేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు. విభజన బిల్లులోని 11వ షెడ్యూల్ ప్రకారం 6 ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై పారదర్శకంగా విచారణ జరిపించాలన్నారు.
Similar News
News January 3, 2026
గుడివాడ ఫ్లైఓవర్కు రైల్వే అనుమతులు.. కానీ.!

గుడివాడలోని రైల్వేగేట్లపై రూ.330కోట్లతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ల పనులకు అనుమతులు లభించాయి. ఇప్పటికే 70% పనులు పూర్తి కాగా, భూసేకరణ చెల్లింపులు తుది దశకు చేరుకున్నాయి. మిగిలిన పనులను రైల్వే అధికారులు నేరుగా పర్యవేక్షించాల్సి ఉంది. సాంకేతిక అనుమతుల ప్రక్రియ దృష్ట్యా ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మరో 6నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరికి ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
News January 2, 2026
పెడన: యువకుడి సూసైడ్

పెడన మండలం చెన్నూరు గ్రామంలో యర్రంశెట్టి వెంకటేష్ (28) తన నివాసంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. పెడన ఎస్ఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 2, 2026
కృష్ణా జిల్లా కలెక్టర్ను ప్రశంసించిన చంద్రబాబు

కలెక్టర్ డీకే బాలాజీని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మలిచిన తీరు అభినందనీయమన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.


