News November 17, 2024

VJA: పోలవరం ప్రాజెక్టుపై సీపీఐ నేత రామకృష్ణ కీలక వ్యాఖ్యలు

image

సీపీఐ నేత రామకృష్ణ పోలవరం ప్రాజెక్టుపై ఆదివారం విజయవాడలో కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం తగ్గించి కేంద్రం రూ.25 వేల కోట్లు ఆదా చేసేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు. విభజన బిల్లులోని 11వ షెడ్యూల్ ప్రకారం 6 ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై పారదర్శకంగా విచారణ జరిపించాలన్నారు.

Similar News

News February 28, 2026

కృష్ణాజిల్లాలో 91.26% మేర పెన్షన్ల పంపిణీ

image

కృష్ణాజిల్లాలో తొలి రోజు 91.26% మేర పెన్షన్ల పంపిణీ జరిగిందని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరి హరనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. 2,32,715 పెన్షన్లకు గాను, 2,12,375 పెన్షన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. 92,38,80,000 మేర పెన్షన్ సొమ్మును అందజేశామన్నారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో అందజేస్తామన్నారు.

News February 28, 2026

కృష్ణా: జిల్లాలో 124 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా శనివారం ద్వితీయ సంవత్సరం వృక్ష శాస్త్రము, హిస్టరీ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 63 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా, 7,374 మంది విద్యార్థులకు 7,293 మంది హాజరయ్యారని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సరళాదేవి తెలిపారు. 124 మంది గైర్హాజరయ్యారని, పరీక్ష సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.

News February 28, 2026

కృష్ణా: పర్యావరణ పరిరక్షణకు కలెక్టర్ పిలుపు

image

పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ జిల్లా కలెక్టర్ డీ.కే బాలాజి శనివారం సైకిల్‌పై విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలుష్య నివారణ కోసం ప్రతి శనివారం ఉద్యోగులందరూ నడక లేదా సైకిల్ ద్వారానే కార్యాలయానికి రావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ స్వయంగా సైకిల్ తొక్కడం అందరిలోనూ స్ఫూర్తిని నింపింది.