News March 5, 2025

VJA: బంగారు నగల కోసం హత్య.. జీవిత ఖైదు

image

నగలు కోసం వృద్ధురాలిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. గుణదలకు చెందిన ఓ వృద్ధురాలిని 2014లో హత్య చేసి బంగారం చోరీ చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు తోట్లవల్లూరుకు చెందిన బుజ్జి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయగా విజయవాడ న్యాయస్థానం  జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నాగేశ్వరావు తీర్పు చెప్పారు. 

Similar News

News October 14, 2025

ఇంజినీరింగ్ విద్యార్థినులకు స్కాలర్‌షిప్

image

రూపా రాహుల్ బజాజ్ స్కాలర్‌షిప్‌ మహిళా విద్యార్థినులకు ఆర్థిక సహాయం, మెంటార్‌షిప్ అందిస్తోంది. ఇంటర్‌లో 75% మార్కులతో ఇంజినీరింగ్ చదువుతున్నవారు అర్హులు. మెకానికల్, ఎలక్ట్రికల్, ECE, ఇండస్ట్రియల్/ప్రొడక్షన్, ఆటోమొబైల్, మెకాట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటీరియల్ సైన్సెస్, మెటలర్జీ బ్రాంచులకు వర్తిస్తుంది. చివరి తేదీ: 31-10-2025. వెబ్‌సైట్: <>https://ruparahulbajajscholarship.bajajauto.co.in/<<>>

News October 14, 2025

బాలికలు రాణిస్తేనే దేశం పురోగతి సాధిస్తుంది: జిల్లా జడ్జి

image

బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తేనే దేశం పురోగతిని సాధిస్తుందని జిల్లా జడ్జి పుష్పలత తెలిపారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయ సంబంధిత విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి బహుమతులు అందజేశారు. పాఠశాల సిబ్బంది, న్యాయసేవా సభ్యులు పాల్గొన్నారు.

News October 14, 2025

తెనాలి: రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్

image

తెనాలి చెంచుపేటలో సంచలనం రేకెత్తించిన జూటూరి తిరుపతిరావు హత్య కేసు నిందితుని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. మృతుని స్వగ్రామం కోడితాడిపర్రులో సొసైటీ దేవాలయానికి సంబంధిన వ్యవహారంలో విభేదాల కారణంగా హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహానికి ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహిస్తున్నారు.