News March 5, 2025
VJA: బంగారు నగల కోసం హత్య.. జీవిత ఖైదు

నగలు కోసం వృద్ధురాలిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. గుణదలకు చెందిన ఓ వృద్ధురాలిని 2014లో హత్య చేసి బంగారం చోరీ చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు తోట్లవల్లూరుకు చెందిన బుజ్జి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయగా విజయవాడ న్యాయస్థానం జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నాగేశ్వరావు తీర్పు చెప్పారు.
Similar News
News November 18, 2025
తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ జిల్లా ఇన్ఛార్జ్గా రవీందర్

తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బాశెట్టి రవీందర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ను ఆర్యవైశ్య సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు బుస్స దశరథం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా రవీందర్ అన్నారు. సంఘం నాయకులు నగుబోతు రవీందర్, కట్కం కిషన్, చికోటి నాగరాజు, పాత మహేష్ పాల్గొన్నారు.
News November 18, 2025
తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ జిల్లా ఇన్ఛార్జ్గా రవీందర్

తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బాశెట్టి రవీందర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ను ఆర్యవైశ్య సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు బుస్స దశరథం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా రవీందర్ అన్నారు. సంఘం నాయకులు నగుబోతు రవీందర్, కట్కం కిషన్, చికోటి నాగరాజు, పాత మహేష్ పాల్గొన్నారు.
News November 18, 2025
అమిత్ షా డెడ్లైన్కి ముందే హిడ్మా ఎన్కౌంటర్!

AP: అల్లూరి(D) మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్లైన్ కంటే ముందే ఇది జరిగిందని తెలుస్తోంది. 2026 మార్చి 31నాటికి దేశంలో నక్సలిజాన్ని రూపుమాపాలని అమిత్ షా గడువు విధించిన విషయం తెలిసిందే. అప్పుడే NOV 30లోపు హిడ్మా ఎన్కౌంటర్ జరగాలని ఆదేశాలిచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి.


