News March 20, 2025

VJA: మిష‌న్ వాత్స‌ల్య‌తో శిశు క్షేమం, సంక్షేమం: కలెక్టర్

image

నిస్స‌హాయ స్థితి, అవ‌స‌రాలుగ‌ల చిన్నారుల క్షేమం, సంక్షేమం ల‌క్ష్యంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న మిష‌న్ వాత్స‌ల్య‌ను ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటైన గ్రామ‌, వార్డుస్థాయి క‌మిటీలు క్రియాశీలం కావాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. గురువారం క‌లెక్ట‌రేట్‌లో మిష‌న్ వాత్స‌ల్య‌ – శిశు సంక్షేమ‌, ర‌క్ష‌ణ జిల్లాస్థాయి క‌మిటీ స‌మావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. 

Similar News

News October 29, 2025

మచిలీపట్నం: ఈదురుగాలులకు ఇల్లు నేలమట్టం

image

మొంథా తుపాను తీవ్ర ప్రభావంతో మచిలీపట్నం 29వ డివిజన్ పరిధిలోని చింతపండుపాలెంలో ఒక పాతగృహం పూర్తిగా కూలిపోయింది. తుపాను కారణంగా వీచిన భారీ ఈదురుగాలుల వేగం ఎక్కువగా ఉండటమే ఈ సంఘటనకు కారణమని స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, నష్టం వివరాలు సేకరిస్తున్నారు.

News October 29, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. HYDలో సెలవుకు డిమాండ్

image

మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో HYDతో సహా ఉమ్మడి RRలో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. నగరంమంతా మబ్బు కమ్మేసి ఇంకా చీకటిగా ఉంది. కాగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని నగరవాసుల నుంచి డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఇంటి నుంచి విద్యాలయాలకు తడుస్తూనే వెళ్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలో సెలవులు ప్రకటించగా HYDలో ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్.

News October 29, 2025

TG: మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వానలు పడతాయంటూ IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పిల్లల్ని బయటికి పంపించొద్దని తల్లిదండ్రులకు సూచించారు.