News February 19, 2025

VJA: రూ.45 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల 

image

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇమామ్‌లు, మౌజమ్‌ల గౌరవ వేతనం నిమిత్తం రూ.45 కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ పశ్చిమ టీడీపీ నేత MS బేగ్ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీ సమాజానికి భరోసాని కల్పించే పార్టీ టీడీపీ మాత్రమే అనన్నారు. గత వైసీపీ పాలనలో ముస్లింలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 5, 2025

MBNR: సీఎంకు కాంగ్రెస్ కార్యకర్త లేఖ..మూడు ముక్కలైందంటూ ఆవేదన

image

సీఎం సార్ కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలైందని, గ్రామంలో ఓ సీనియర్ కాంగ్రెస్ నేత BRS పార్టీ నుంచి వచ్చిన వాళ్లకే వార్డు అభ్యర్థులను కేటాయించారని MBNR(D) గండీడ్(M) పెద్దవార్వాల్‌కి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లెటర్ వైరల్ అయింది. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేశామని, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ పార్టీని కాపాడాలన్నారు.

News December 5, 2025

KNR: ‘నజరానా’లంటారు.. ‘నారాజ్’ చేస్తారు..!

image

స్థానిక ఎన్నికల వేళ ప్రకటిస్తున్న నజరానాలు నీటి మూటలేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో ఉమ్మడి KNRలో 106 GPలు ఏకగ్రీవమవ్వగా తాజాగా 20 GP(1ST ఫేజ్)లు ఏకగ్రీవమయ్యాయి. అప్పటి BRS ప్రభుత్వం ఏకగ్రీవ గ్రామాలకు రూ.5 లక్షలిస్తానని రూపాయీ ఇవ్వలేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10లక్షల నజరానా ప్రకటించగా కేంద్రమంత్రి బండి సంజయ్ BJP మద్దతున్న అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే రూ.10లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు.

News December 5, 2025

8ఏళ్లైనా పూర్తికాని WGL కమిషనరేట్ పనులు!

image

కమిషనరేట్ నూతన భవన నిర్మాణానికి 2017లో భూమిపూజ జరిగినా, ఎనిమిదేళ్లు కావస్తున్నా పనులు పూర్తి కాలేదు. దీంతో శాఖలకు చాంబర్లు, కార్యాలయాలు లేక ఇబ్బందులు అధికమవుతున్నాయి. పాత హెడ్ క్వార్టర్స్<<18473913>> భవనాల్లో తగిన స్థలం<<>> లేకపోవడంతో CP, DCPలు, అనేక విభాగాలు గదులు పంచుకొని పనిచేస్తున్న పరిస్థితి ఉంది. నిర్మాణం ఆలస్యం కారణంగా పోలీసులు రోజువారీ పనుల్లో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.