News February 20, 2025
VJA: ‘రోస్టర్ విధానంలోని తప్పులు సరిచేయాలి’

గ్రూప్-2లోని రోస్టర్ విధానం సవరించాలని అభ్యర్థులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రూప్-2 అభ్యర్థులను పట్టించుకోలేదన్నారు. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పి అధికార పీఠమెక్కిన జగన్ కీలకమైన గ్రూప్-1, 2 ఉద్యోగాల నియామకాలను పక్కన పెట్టారన్నారు. ఈనెల 23న జరిగే పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారని మండిపడ్డారు. రోస్టర్ విధానంలోని తప్పులు సరిచేయాలన్నారు.
Similar News
News November 12, 2025
జిల్లాలో 7372 ఇళ్ల నిర్మాణం పూర్తి: ప్రకాశం కలెక్టర్

జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 7372 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని కలెక్టర్ రాజా బాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గృహ నిర్మాణాలకు సంబంధించి బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గృహాల నిర్మాణం ద్వారా రూ. 17.77 కోట్ల ఆర్థిక ప్రయోజనం లబ్ధిదారులకు మేలు జరిగిందన్నారు. వివిధ నిర్మాణ దశలు పూర్తి చేసుకున్న 11,443 మందికి రూ.18.36 కోట్ల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించిందని తెలిపారు.
News November 12, 2025
MBNR: అథ్లెటిక్స్ ఎంపికలకు 350 మంది హాజరు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17 విభాగాల్లో అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైన వారు నవంబర్ 14 నుంచి 16 వరకు రంగారెడ్డి జిల్లాలోని జింఖానా మైదానంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
News November 12, 2025
భారతీయ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఇటలీ జంట

భారతీయ సంప్రదాయంపై నమ్మకంతో ఇటలీ నుంచి వచ్చిన జంట కాశీలో వివాహం చేసుకున్నారు. పెళ్లి కూతురు యాంటీలియా, పెళ్లి కొడుకు గ్లోరియస్ సనాతన సంప్రదాయం ప్రకారం నవదుర్గ ఆలయంలో ఒక్కటయ్యారు. ఆచార్య మనోజ్ మంత్రాలు చదువుతుండగా ఈ జంట దండలు మార్చుకుని, బొట్టు పెట్టుకుని, అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచింది. ఏడాది క్రితం వీరు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నపట్పికీ ఇప్పుడు భారతీయ సంప్రదాయంలో వివాహమాడటం గమనార్హం.


