News March 30, 2025

VJA: శరవేగంగా విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ పనులు

image

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులు రానున్న 3 నెలల్లో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రూ.540 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ఈ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని గుత్తేదారుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కూచిపూడి, అమరావతి థీమ్‌తో రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ టెర్మినల్ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Similar News

News December 2, 2025

వరంగల్: గుర్తులు రెడీ.. నోటా టెన్షన్..!

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఉపసంహరణ తర్వాతే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. సర్పంచ్ స్థానానికి 30, వార్డు సభ్యులకు 20కి పైగా గుర్తులు కేటాయించారు. సర్పంచ్‌కు గులాబీ బ్యాలెట్, వార్డు సభ్యులకు తెలుపు బ్యాలెట్‌ను నిర్ణయించారు. బ్యాలెట్‌లో నోటా చేరడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.

News December 2, 2025

NGKL: సర్పంచ్ ఎన్నికలు.. బరిలో నిలిచేదేవరో, తప్పుకునేదెవరో..?

image

NGKL జిల్లాలో దాదాపు రెండేళ్ల తర్వాత జరుగుతున్న సర్పంచ్‌ ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొన్ని గ్రామాల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు ఆశావహులు నామినేషన్లు వేయడంతో నాయకులకు తలనొప్పిగా మారింది. ఓట్లు చీలకుండా నివారించేందుకు.. ఒక్కరినే బరిలో దించడానికి, నామినేషన్ల ఉపసంహరణకు నేతలు బుజ్జగింపులు మొదలుపెట్టారు. రేపటితో తొలి విడతలో బరిలో నిలిచేది ఎవరో తేలనుంది.

News December 2, 2025

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా మైసూరుకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల సౌకర్యార్ధం ఉమ్మడి కృష్ణా మీదుగా CCT(కాకినాడ టౌన్)- మైసూరు(MYS) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. 07033 CCT- MYS రైలు వచ్చే నెల 12 వరకు ప్రతి సోమ, శుక్రవారం, 07034 MYS- CCT రైలు వచ్చే నెల 13 వరకు ప్రతి మంగళ, శనివారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.