News February 17, 2025
VJA: ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు మృతి

విజయవాడలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనలు చేటు చేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుడమేరు ఏరియాలో ఉండే మణికంఠ (32) ఈ నెల 6న తన భార్య, పిల్లలు బయటకు వెళ్లి తిరిగి రాలేదని మనస్తాపంతో గడ్డిమందు తాగాడు. శనివారం చికిత్సపొందుతూ మృతి చెందాడు. మరోవైపు అప్పుల బాధ తాళలేక కట్టా వీర్రాజు అనే వ్యక్తి విషం తాగాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సండే మృతి చెందాడు. ఈ ఘటనలపై కేసు నమోదు చేశారు.
Similar News
News July 6, 2025
NLG: రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ

KGBVలో ప్రత్యేక అధికారులు, PGCRTలు, CRTలు, పీఈటీలు, ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టులతో పాటు అదేవిధంగా టీజీ MSGHలో ఖాళీగా ఉన్న పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో ఈ నెల 7వ తేదీ వరకు ఫిర్యాదులు చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు. 1:1 నిష్పత్తిలో సబ్జెక్టుల వారీగా అభ్యర్థులు జాబితాను డీఈవో వెబ్సైట్లో పొందు పరిచామని తెలిపారు.
News July 6, 2025
అందరూ ఇంకుడు గుంతలు నిర్మించండి: MD

గ్రేటర్ HYDలో వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించాలని జలమండలి ఎండి అశోక్ రెడ్డి సూచించారు. జలమండలి పరిధిలో ఇంకుడు గుంతలకు సంబంధించి ప్రతి ఇంటింటికి సర్వే నిర్వహించింది. సర్వేలో 40,206 ఇండ్లను గుర్తించిన అధికారులు, ఇంకుడు గుంతలు 22,813 భవనాల్లో ఉన్నట్లుగా గుర్తించారు.17,393 భవనాలలో ఇంకుడు గుంతలు లేవు. దీని కారణంగా 16,066 మందికి జలమండలి నోటీసులు జారీ చేసింది.
News July 6, 2025
బల్లికురవ PS పరిధిలో 53 క్రిమినల్ కేసులు రాజీ

అద్దంకి కోర్టులో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా బల్లికురవ ఎస్సై నాగరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో బల్లికురవ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కేసులు పరిష్కారమయ్యాయని ఆయన చెప్పారు. 403 కేసులకు సంబంధించి జరిమానా అలాగే 53 క్రిమినల్ కేసులకు సంబంధించి రాజీ పడినట్లుగా ఎస్సై పేర్కొన్నారు. రాజీ అనేది ఉత్తమ మార్గమని ఎస్సై అన్నారు.