News October 30, 2025

VJA: ఆలయాల నష్టంపై కమిషనర్ సమీక్ష

image

‘మొంథా’ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని దేవాదాయ సంస్థలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కమిషనర్ కె. రామచంద్ర మోహన్ బుధారం ఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆలయ భవనాలు, ఆస్తుల నష్టం వివరాలు సేకరించి, తక్షణ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిసరాల శుభ్రత, శానిటేషన్‌ను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

Similar News

News October 30, 2025

KNR: మొంథా తుఫాన్.. రైతన్నలకు మిగిల్చింది తడిసిన ధాన్యమే

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. అధికారుల అంచనా ప్రకారం 2036 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలో తడిసి ముద్దయినట్లు సమాచారం. చేతికి వచ్చిన పంట అమ్ముకునే సమయంలో వర్షాలు పడి పంట నష్టాన్ని కలిగించిందన రైతులు వాపోయారు. రైతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించే సాయమే మిగిలిందని రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు.

News October 30, 2025

నవంబర్ 7న రెడ్ క్రాస్ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక

image

నవంబర్ 7న రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లా రెడ్‌క్రాస్ శాఖలో సభ్యత్వం కలిగిన పేట్రాన్, వైస్ పేట్రాన్, లైఫ్ మెంబర్స్, లైఫ్ అసోసియేట్ సభ్యులంతా తప్పక హాజరు కావాలన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖకు నూతన మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

News October 30, 2025

పార్వతీపురం: రచ్చబండే క్లాస్ రూమ్ అయ్యింది..!

image

కురుపాం మండలంలో గోలవలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావ్యవస్థకు చేరుకుంది. వర్షాలు పడినప్పుడు పూర్తిగా కారిపోతున్న నేపథ్యంలో తప్పని పరిస్థితిల్లో గ్రామ రచ్చబండ దగ్గర విద్యార్థులకు టీచర్లు చదువులు చెప్పుతున్నారు. సర్పంచ్ సురేశ్ మాట్లాడుతూ.. సుమారు 50 సంవత్సరాలు క్రితం నిర్మించిన భవనం కావడంతో శిథిల వ్యవస్థకు చేరుకుందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి నూతన భవనాన్ని మంజూరు చేయాలని కోరారు.